My Channel Tirupati🙏🙏🙏🙏🙏 తెలుగు,తిరుపతి updates
СтатистикаTirumala Tirupati Devasthanam updates
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 20
- Всего постов
- 22
- Тип
- открытый
- Язык
- te
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 162
- 1/48двое суток
- 185
- 1/72трое суток
- 200
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
👆 *పలమనేరులో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ* *దీపం ఇంటికే కాదు.. సమాజానికీ వెలుగునిస్తుంది: జేఈవో డా. ఏ. శరత్* *మహాలక్ష్మీ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉంది: ఎమ్మెల్యే శ్రీ ఎన్. అమర్నాథ్ రెడ్డి* *భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాది మంది మహిళలు*
без подписи
без подписи
Hurry up!!!! Back in Stock High Demand 🫴 👌 Limited Stock 🤞 Usefull for Pooja,office,Gift items,Decoration Click here to buy👉👉 https://link.amazon/B0gZ64P1Q Govinda 🙏
👆 *తిరుమలలో ఘనంగా పురుశైవారి తోట ఉత్సవం* తిరుమల,2026ఆగస్టు 14:: శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో భూదేవి అంశగా ఆండాళ్(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రతి ఏడాదీ తిరువాడిపురం శాత్తుమొర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి కలిసి పురుశైవారితోటలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర నిర్వహించారు. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి బయల్దేరారు. మార్గమధ్యంలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, శఠారి సమర్పించారు. శఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, అనంతాళ్వార్ వంశస్తులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
без подписи
без подписи
👆 *బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి* *రియల్టైమ్లో ఫిర్యాదుల పరిష్కారానికి ‘నందకం’ యాప్* *టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి* తిరుమల,2026ఆగస్టు 14:: వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడంపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు. తిరుమల పవిత్రతకు, స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచేలా మరింత మెరుగైన పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన మెటీరియల్స్, ఆధునిక యంత్రాల వినియోగంపై కూడా చర్చించినట్లు వివరించారు. *రియల్టైమ్ ఫిర్యాదుల పరిష్కారానికి ‘నందకం’ యాప్* తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కొత్తగా ‘నందకం’ యాప్ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను రియల్టైమ్లో నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని కూడా పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే యాప్ ద్వారా గుర్తించి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి, సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. తిరుమలతో పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి ఫుట్పాత్, ఇతర పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ‘మన ఊరు – మన గుడి’ వంటి సంస్థలు ముందుకు వచ్చి శుభ్రతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు తిరుమలకే పరిమితం కాకుండా ఘాట్ రోడ్లు, ఫుట్పాత్లు, పరిసర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇటీవల భక్తుల నుంచి తిరుమలలో స్వచ్ఛతపై మంచి అభిప్రాయాలు వస్తున్నాయని తెలిపారు. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు, సిబ్బంది మాత్రమే బాధ్యతగా భావించకుండా ప్రతి భక్తుడు కూడా తన బాధ్యతగా తీసుకోవాలని అదనపు ఈవో కోరారు. భక్తులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల నుంచి చెత్తను బయటకు విసిరేయడం, ప్రయాణంలోనే ప్లాస్టిక్ తదితర వస్తువులను పడేయడం వంటి చర్యలు తరచుగా కనిపిస్తున్నాయని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు భక్తులు ప్లాస్టిక్ను తీసుకువచ్చి ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని చెప్పారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడి పవిత్రత, స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వారికి భక్తులు కూడా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
без подписи
https://youtu.be/wy03xWFZhRE?si=00_iUMoaLwJW2Rjo
без подписи
без подписи
без подписи
без подписи
తిరుపతి, 2026 ఆగస్టు 14 నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ సందేశాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి టీటీడీ సేవల బుకింగ్లు అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలి తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్ల పేరుతో నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలు నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో భక్తులు టీటీడీకి సంబంధించిన దర్శనం, సేవలు, వసతి బుకింగ్లను అధికారిక టీటీడీ వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది. వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే అనధికారిక బుకింగ్ లింకులతో అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్మార్క్లను ఉపయోగిస్తూ నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీస్ తదితర విభాగాల సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. ఇటువంటి నకిలీ డిజిటల్ ప్లాట్ఫామ్లను గుర్తించి తొలగించడం, బ్లాక్ చేయించడం, దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. గత రెండేళ్లలో 259 ఫేక్ వెబ్ సైట్లను గుర్తించి తొలగించడంతో పాటు ఆ వెబ్ సైట్ లకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. టీటీడీ పేరు, లోగో, మేధో సంపత్తిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్మార్క్, సైబర్ చట్టాల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులు ఈ జాగ్రత్తలు పాటించాలి * టీటీడీ సేవలు, దర్శనం, వసతి బుకింగ్లను అధికారిక టీటీడీ వెబ్సైట్/యాప్లో మాత్రమే చేసుకోవాలి. * వాట్సాప్లో వచ్చే అనధికారిక బుకింగ్ సందేశాలు, లింకులను నమ్మకూడదు. * టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీలను చూసి మోసపోవద్దు. * తెలియని వ్యక్తులకు బుకింగ్ పేరుతో డబ్బులు పంపవద్దు. * టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తున్న వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ఖాతా అధికారికమైనదో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలి. భక్తులు అప్రమత్తంగా ఉండి, నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ సందేశాల ద్వారా జరిగే సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
https://youtu.be/pLscT-045FU?si=jR3o_I3RG1SCobyo
https://youtu.be/pLscT-045FU?si=DehhMV5VKjsSL0O7
без подписи
*SSD & DD Tokens Issue Started @ 5:00Am* *SSD Tokens – Current Status:* • Today Quota Completed @6:15am *Srivari Mettu Divya Darshan Tokens:* • Today Quota Completed @6:15am