tgindex

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

описание

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

16 342
подписчиков
Охват к подписчикам
8,7%
ERR
Реакции к просмотрам
0,00%
0 на 22 постов
Пересылки к просмотрам
0,27%
87
Постов в день
0,7
всего 22

Где отзываются чаще

доля реакций к просмотрам
  • 15 авг.స్వామివారు కనుమరుగయ్యేదాకా నమస్కరిస్తూ, కళ్ల నీళ్లతో అలా చూస్తూ ఉన్నాడు వెంకట్రామన్. ఇప్పటికీ ఆ పాదుకలు వెంకట్రామన్ ఇంటిలోనే ఉన్నాయి. --- “మహా పెరియవా” సంకలనం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। దీవ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం కాంచీశ్వరీ రుచిర చిత్కళయా సుదీప్తం దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం0,00%
  • 15 авг.ఎక్కడివి ఈ పాదుకలు? దాదాపు యాభై సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు చెన్నైలో మకాం చేస్తున్నారు. మైలాపూర్, అడయార్, తిరువాన్మియూర్ మొదలైన ప్రాంతాల్లో పర్యటిస్తూ, అక్కడ త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర పూజలు చేస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. వేలమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చి, పూజలు చూసి, ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు. ఈ సమయంలో మహాస్వామివారు తిరువాన్మియూర్‌లో ఉన్న మరుదీశ్వరర్ దేవాలయానికి వచ్చారు. ‘జయ జయ శంకర, హర హర శంకర’ అంటూ వేలకొలదీ భక్తులు దేవాలయానికి వచ్చారు. స్వామివారు దర్శనం అయిన తరువాత బయటకు వచ్చి, మాడవీధిలో నడుస్తూ, అక్కడ పీఠం మకాం చేస్తున్న ఒక పెద్ద బంగళాలోకి వచ్చారు. మఠం పరివారంతో పాటు ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు అన్నిటికీ కూడా తగిన ఏర్పాట్లు చేశారు ఈ ఇంటివారు. ఆ ఇంటి యజమాని విద్యుత్ శాఖలో పనిచేసే స్వామివారి భక్తుడైన వెంకట్రామన్. స్వామివారు ఎప్పుడు తిరువాన్మియూర్ వచ్చినా ఇక్కడే బస చేసేవారు. స్వామివారి రాకతో ఆ మాడవీధి మొత్తం కొత్త రూపు సంతరించుకుంది. స్వామివారు తమ ఇంటిలో ఉండి పూజలు చేస్తూ, తమను ఆశీర్వదించడం ఎన్నో జన్మల పుణ్యకర్మల ఫలంగా భావించేవారు వెంకట్రామన్ కుటుంబ సభ్యులు. ఉదయం స్వామివారి విశ్వరూప దర్శనంతో మొదలుపెట్టి, చంద్రమౌళీశ్వర పూజ, తరువాత స్వామివారి ఉపన్యాసం—ఇలా రోజంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఆ ఇంటిని చూసి ఎంతగానో పరవశుడయ్యేవాడు వెంకట్రామన్. అక్కడ కొన్ని రోజులు బస చేసిన తరువాత స్వామివారు కంచికి వెళ్లిపోయారు. ఇన్నిరోజులు పెద్ద ఉత్సవంలా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. స్వామివారు ఆ ఇల్లు వదిలిపోయినా, ఆ ఇంట్లోవారికి ఇంకా స్వామివారు ఉన్నట్టుగానే అనిపిస్తోంది. రోజువారీ పనులు చేసుకుంటూ, స్వామివారు ఉన్నప్పటి జ్ఞాపకాలను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. మామూలుగా స్వామివారు కూర్చునే చోటు, స్వామివారు భిక్ష చేసే ప్రదేశం, స్వామివారు విశ్రమించే గది—ఇలా అన్నీ. కొద్ది వారాల తరువాత వెంకట్రామన్ స్వామివారు పూజచేసే గదిలోకి వెళ్లి చూస్తూ ఉండగా, ఒక వస్తువును చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే చేతులతో చప్పట్లు కొట్టుకుని, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, “ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి?” అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. అతను చూసినది ఏమిటి? పరమాచార్య స్వామివారి పాదుకలు! ఆశ్చర్యాన్ని, భక్తిని సమపాళ్లలో అనుభవిస్తూ, అత్యంత సున్నితంగా స్వామివారి పాదుకలను చేతులతో తాకాడు. వాటికి మనస్ఫూర్తిగా నమస్కరించాడు. అంతా అయోమయంగా ఉంది. స్వామివారు ఇక్కడినుండి వెళ్లి చాలా వారాలు అయ్యింది. కొన్ని వేల సార్లు ఈ వైపు వచ్చి ఉంటాను, మరి వీటిని నేను ఎందుకు చూడలేదు? ఇంట్లోవారందరినీ పిలిచి స్వామివారి పాదుకలను అందరికీ చూపించాడు. స్వామివారే మరలా ఇంటికి తిరిగి వచ్చారు అన్నంతగా సంబరపడ్డారు ఆ పాదుకలను చూసి. ఒక పెద్ద ఇత్తడి పళ్లెం తెచ్చి పాదుకలను ఉంచి అభిషేకం, పూజ చేశారు. గంధం, కుంకుమతో అలంకరించి, పాదుకల చుట్టూ పెద్ద పూలహారం వేశారు. “ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి?” అని అడిగారు ఇంట్లోని పెద్దవారు. “నాకు తెలియదు. ఇవాళే వీటిని గమనించాను. బహుశా ఇవి ఈరోజే నాకు కనబడాలని రాసిపెట్టి ఉందేమో” అని బదులిచ్చాడు. “బహుశా స్వామివారు వెళ్లేటప్పుడు ఈ పాదుకలను మర్చిపోయారు అనుకుంటా” అని ఒక పెద్దాయన అన్నారు. “నేను కూడా అదే అనుకుంటున్నాను” అన్నాడు వెంకట్రామన్. వెంటనే కంచికి వెళ్లి స్వామివారికి తిరిగి ఇవ్వాలి అనుకున్నాడు. అయితే పనిఒత్తిడి వల్ల చాలా రోజులు కంచి వెళ్లలేకపోయాడు. కానీ పాదుకలకు రోజూ పూజా, అభిషేకం తప్పక చేస్తున్నారు. కొన్ని వారాల తరువాత కాస్త పనిభారం తగ్గడంతో పాదుకలను తీసుకుని కాంచీపురం వెళ్లాలని నిశ్చయించుకున్నాడు వెంకట్రామన్. స్వామివారి పాదుకలను తలపై పెట్టుకుని, “జయ జయ శంకర, హర హర శంకర” అని జపిస్తూ తిరువాన్మియూర్ నుండి కంచికి పాదయాత్రగా, ఎక్కడా ఆగకుండా వెళ్లాడు. స్వామివారి దర్శనం కోసం వేచివున్నాడు. పాదుకలను స్వామివారి ముందు ఉంచి, ఆనందాశ్రువులతో స్వామివారికి నమస్కరించి నిలబడ్డాడు. స్వామివారు ప్రశాంతంగా వెంకట్రామన్‌ను చూస్తూ, పాదుకలవైపు చూపించి, “ఏమిటిదంతా?” అని అడిగారు. “స్వామీ! మీరు తిరువాన్మియూర్‌లో మా ఇంటి నుండి కంచికి వచ్చేటప్పుడు వీటిని అక్కడే వదిలి వచ్చారు. అందుకనే నేను వీటిని మీకు తిరిగి ఇవ్వడానికి తీసుకుని వచ్చాను” అని చెప్పగానే స్వామివారు చిన్నగా నవ్వుతూ, “ఓరి పిచ్చివాడా! నీకు ఇవ్వాలనే వాటిని నేను అక్కడే వదిలివచ్చాను. వాటిని ఎలా తెచ్చావో అలాగే తిరిగి తీసుకుని వెళ్లు. మరొక్కసారి నా ఆశీస్సులు ఇస్తాను” అని ఒక పిడికెడు కుంకుమను ఆ పాదుకలపై వేశారు స్వామివారు. ఆనందంతో తన అదృష్టాన్ని తలచుకుని కన్నీళ్లపర్యంతం అయ్యాడు. దగ్గరలో ఉన్న సేవకునివైపు చూసి, “పాపం వెంకట్రామన్ మద్రాసు నుండి నడుచుకుంటూ ఇక్కడకు వచ్చాడు. లోపలకు తీసుకువెళ్లి మంచిగా భోజనం పెట్టి, జాగ్రత్తగా ఇంటికి పంపు” అని ఆదేశించి స్వామివారు లోపలకు వెళ్లిపోయారు.0,00%
  • 14 авг.స్వామివారు తమ కుడిచేయి ఎత్తి పిల్లవాడిని ఆశీర్వదించారు. కొద్దిరోజుల్లోనే పిల్లవాడి ఎడమవైపు పక్షవాతం పోయి, ఇతనికేనా పక్షవాతం వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయేంతగా లేచి పరిగెత్తి చక్కగా ఆడుకునేవాడు. తీక్షణమైన స్వామివారి చూపు మహిమ అది. --- “మహా పెరియవా” సంకలనం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। దీవ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం కాంచీశ్వరీ రుచిర చిత్కళయా సుదీప్తం దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం0,00%
  • 14 авг.చూపుతో పోయిన పక్షవాతం కంచి మఠంలో ఉన్న పరమాచార్య స్వామివారిని దర్శించడానికి కేరళ నుండి వచ్చిన ప్రఖ్యాత జ్యోతిష్కులు ఒకరు, స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత, అక్కడున్న భక్తులందరూ ఆయనను చుట్టుముట్టి తమ తమ కష్టాలు చెప్పుకున్నారు. వెంటనే ఆ జ్యోతిష్కుడు, “నడిచే దైవం పరమాచార్య స్వామివారు ఉన్న చోటు నుండి 500 మీటర్ల చుట్టూ ఏ గ్రహమూ పనిచేయదు. కనుక మీ గ్రహస్థితులను ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను. మీరు నేను ఉన్నచోటుకు రండి” అని బదులిచ్చారు. ఈశ్వరునిపై అత్యంత భక్తివిశ్వాసాలు కలిగిన పదహారేళ్ల బాలకుడైన మార్కండేయుణ్ణి తిరుక్కడవూర్ అమృతకంఠేశ్వరుడు యముని బారి నుండి కాపాడిన విషయం మనకు తెలుసు కదా! అలాగే మన మహాస్వామివారు కూడా తనను నమ్మిన భక్తులను, తన దర్శనానికి వచ్చిన భక్తులను కూడా అలాగే రక్షించారు. భౌతిక శరీరం త్యజించిన తరువాత కూడా తనను నమ్మి బృందావనం వద్దకు వచ్చిన ఎందరినో రక్షించారు. అలాంటి ఒక భక్తుడు రాజ శాస్త్రి తిరుచిరాపల్లిలోని మేల్ చింతామణిలో ఉండేవారు. అతనికి అన్నీ మహాస్వామివారే. మంచి అయినా చెడు అయినా ముందుగా పరమాచార్య స్వామివారికి నివేదించడం అతనికి ఆనవాయితీ. ఏదైనా స్వామివారికి చెప్పి, స్వామివారి ఆదేశాన్ని పాటించడం తప్ప ఎన్నడూ స్వామివారి ఆదేశాన్ని తప్పలేదు. రాజ శాస్త్రి కుమార్తెకు కుమారుడు జన్మించడంతో, ఆ బాలునికి శ్రీనివాసన్ అని నామకరణం చేసి, ఎంతో ఆనందంగా కుటుంబమంతా “శ్రీనివాసా, శ్రీనివాసా” అని పిలుస్తూ ఆ పిల్లవాడిని చూసి సంతోషించసాగారు. మనం పిల్లల్ని ఎంతగా ప్రేమించినా, ఎంత జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నా, పూర్వజన్మ పాపపుణ్యాల లెక్కల నుండి తప్పించలేము. పూర్వజన్మలలో మిగిలిపోయిన శేషాన్ని ఈ జన్మలో అనుభవించవలసిందే. వయస్సు, మేధస్సు, సంపద, అధికారం ఏదీ కూడా ఆ కర్మ నుండి తప్పించదు. అనుభవించి తీరవలసిందే. ఆ చిన్ని బాలుడు శ్రీనివాసన్ కూడా పూర్వజన్మ ఫలితాలను అనుభవించవలసిన సమయం వచ్చిందేమో! ఇంటివారు ఎవరూ ఆ బిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఆ పిల్లవాడికి వేయాల్సిన టీకాలన్నీ సరైన సమయంలో వేయించేవారు. మూడు సంవత్సరాలు నిండిన తర్వాత చికెన్‌పాక్స్ టీకా కోసం పిల్లవాణ్ని తీసుకువెళ్లారు. కానీ ప్రారబ్ధాన్ని ఎవరూ తప్పించలేరు కదా! ఆ బాబుకు గడువు ముగిసిన టీకా వేశారు ఆ ఆసుపత్రి వారు. కానీ అది ఆ కుటుంబానికి తెలియదు. ఎంతో హుషారుగా, చలాకీగా ఉండే ఆ పిల్లవాడిలో టీకా ప్రభావం మెల్లిగా కనబడసాగింది. బాగా నీరసపడిపోయాడు. కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అనుకున్నారు అందరూ. హఠాత్తుగా పిల్లవాడి ఎడమవైపు భాగం పక్షవాతానికి గురయ్యింది. చలాకీగా ఉండే బాబు ఇప్పుడు కనీసం పక్కకు కూడా తిరగలేకపోతున్నాడు. తన బాధను చెప్పుకోలేక ఎంతో వేదనను అనుభవిస్తున్నాడు. ఇంట్లోని వారు ఏమీ చేయలేక చూస్తుండిపోయారు. చిన్న చిన్న కదలికలు తప్ప శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. ఏమి జరిగిందో తెలియక అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఉన్న పెద్దవారు తమ అనుభవాన్ని, బుద్ధిని ఉపయోగించి తెలిసినవన్నీ చేశారు. ఇంటి చిట్కాలు, తెలిసిన మందులు, ఇరుగు పొరుగు చెప్పినవి అన్నీ చేశారు. పిల్లాడికి త్వరగా తగ్గిపోవాలని కనిపించిన ఆలయాలకు వెళ్లి, అందరు దేవుళ్లను మొక్కారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తర్వాత చివరగా ఒక పెద్ద ఆసుపత్రిలో శ్రీనివాసన్ పరిస్థితికి కారణం కనుగొన్నారు—గడువు ముగిసిన టీకా. వెంటనే వైద్యం ప్రారంభించినా అంతగా గుణం కనిపించలేదు. రోజులు గడుస్తున్నాయి కానీ పిల్లాడిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అప్పుడే ఆ ఇంటివారికి తమ దైవం కంచి పరమాచార్య స్వామివారు గుర్తువచ్చారు (దేనికైనా సమయం రావాలి కదా!). పిల్లవాడిని మహాస్వామివారి సన్నిధికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుని, తిరుచ్చి నుండి కాంచీపురానికి బయలుదేరారు. వీరు కంచి మఠం చేరుకునే పాటికి స్వామివారు తివాచీ మీద కూర్చుని వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తున్నారు. స్వామివారి ఎదురుగా పిల్లవాడు శ్రీనివాసన్‌ను కూర్చోబెట్టారు. శరీరం ఆధీనంలో లేకపోవడంతో పిల్లవాడు తంజావూరు బొమ్మ తల ఆడించినట్టు తల అల్లాడిస్తున్నాడు. కొద్దిసేపటి తరువాత తల కాస్త కుదుటపడినట్టుగా కనిపించింది. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. శరీరంలో ఎటువంటి కదలిక లేని శ్రీనివాసన్ తన ఎడమ చేతిని నేలకు గట్టిగా నొక్కిపెట్టి, కుడిచేతిని ముందుకు చాపి స్వామివారిని అర్థిస్తున్నట్టు చూశాడు. స్వామివారు చిన్నగా మందహాసం చేస్తూ పిల్లాడివైపే చూస్తున్నారు. శ్రీనివాసన్ అలాగే కూర్చుని, కుడిచేతిని అలాగే చాచి స్వామివారికి దగ్గరగా వెళ్లాడు. స్వామివారి ముందున్న పళ్ల బుట్ట వైపు చూపిస్తూ “నాకు కావాలి” అన్నట్టుగా సైగ చేశాడు. స్వామివారు మరింత తీక్షణంగా పిల్లవాడిని చూస్తూ, “నీకు ఈ పళ్లు కావాలా? అయితే నువ్వే తీసుకో” అన్నారు స్వామివారు. కుటుంబమంతా ఆనందాశ్రువులతో చూస్తూ ఉండగా, పిల్లవాడు పళ్ల బుట్ట దగ్గరకు వెళ్లి, ఒక బత్తాయి పండును తీసుకుని చేతిలో గట్టిగా పెట్టుకున్నాడు.0,00%
  • 13 авг.మండపం ఖాళీ చెయ్యండి కర్ణాటక రాష్ట్రంలో హంపికి దగ్గర్లోని తుంగభద్రా నది ఒడ్డున గల ఆనెగొందిలో పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యపు ఆనవాళ్ళు మనకు ఇక్కడ ఇప్పటికి కనిపిస్తాయి. ఇక్కడే శ్రీరాముడు బాణంతో వాలిని సంహరించాడని చెబుతారు. అలాగే మధ్వులకు పరమపవిత్రమైన నవబృందావనం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్రా నదీ మధ్యభాగంలో ఉన్న ఒక చిన్న రాతి ద్వీపంపై మధ్వ సంప్రదాయంలోని ఆచారపురుషులవి తొమ్మిది బృందావనాలు ఉన్నాయి. ఇది మధ్వుల కాశి. కనుక ఎక్కువ సంఖ్యలో మధ్వులు ఇక్కడకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. హొస్పేట్ పట్టణంలో చింతామణి మఠం ఆధ్వర్యంలో అన్నపూర్ణా ఆలయం ఉంది. పరమాచార్య స్వామివారి ఆదేశం ప్రకారం అన్నపూర్ణకు లడ్డూలతో అలంకారం చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలప్పుడు హఠాత్తుగా మహాస్వామివారు వంట చేస్తున్న మండపాన్ని అత్యవసరంగా ఖాళీ చెయ్యవలసిందని ఆదేశించారు. మొత్తంగా ఖాళీ చేసి, అన్నపూర్ణ దేవాలయం పక్కకు మార్చమని చెప్పారు. “ఆ వంట గదిలో ఒక పిల్లి దాని పిల్లలు కూడా ఉన్నాయి. వాటిని కూడా బయటకు పంపండి” అని ఆజ్ఞాపించారు. మండపం ఖాళీ చేసిన అరగంటలోపే కారణాంతరాల వల్ల మెల్లగా కూలిపోయింది. మహాస్వామివారు పిల్లి, పిల్లి పిల్లలతో సహా అందరినీ రక్షించారు. --- టి.యన్. సుప్పిరమణి. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం0,00%
  • 12 авг.కాఫీ ఖాతా ఒకరోజు అకస్మాత్తుగా పరమాచార్య స్వామివారు తము మకాం చేసినచోట ఉన్న ఉగ్రాణంలోకి వెళ్ళి అలా బయటకు వచ్చారు. మహాస్వామివారికి తెలియకుండా నలుగురైదుగురు సిబ్బంది కాఫీ తయారుచేసుకొని తాగుతున్నారు. స్వామివారు ఆ విషయం గమనించారేమో అని వారు భయపడ్డారు. కాని స్వామివారు ఆ విషయమై ఏమి అడగకపోవడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారు ఏమీ గమనించలేదని సంతోషపడ్డారు. రాత్రి స్వామివారు నన్ను పిలిచి, ఫలహారం అయిన తరువాత సిబ్బంది అందరినీ సమావేశపరచాలని మేనేజరుకు చెప్పమని నాకు చెప్పారు. ఆ సమావేశానికి పద్దుల పుస్తకంతో రావాల్సిందిగా చెప్పమన్నారు. ”ఏ లెక్కల పుస్తకం?” అని నన్నడిగారు మేనేజరు. నేను స్వామివారిని అడగగా, “ఏవో ఒకటి రెండు లెక్కాపద్దుల పుస్తకాలు పట్టుకుని రమ్మను” అని ఆదేశించారు. సిబ్బంది అందరూ సమావేశమయ్యారు. స్వామివారు వారితో, “ఈ పుస్తకంలో ఉన్నది అంతా సరైనది అని ఒప్పుకుని నమస్కారం చెయ్యండ”ని ఆదేశించారు. మనసులో భయంతో వారిలో కొంతమంది అలా చెయ్యడానికి ముందుకురాలేదు. “ఎందుకు ఆలోచిస్తున్నారు? అందులో ఉన్నది అంతా నిజమే అయితే నమస్కారం చెయ్యండి” “అదీ. . . ” “ఆ ఖర్చును ఏ లెక్కలో చూపిస్తున్నారు?” అని అడిగారు స్వామివారు. “ఆవుల ఆహారం కోసం పత్తి విత్తనాలు కొన్నట్టుగా” అని బదులిచ్చారు. వారి ఇబ్బందిని స్వామివారు అర్థం చేసుకొన్నారు. పీఠాధిపతుల భిక్ష తరువాతనే వారు ఆహారం స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. చాలాసార్లు స్వామివారు భిక్ష చెయ్యడానికి మధ్యాహ్నం రెండు అవుతుంది కాబట్టి వారికి తాగడానికి ఏదో ఒకటి కావాలి. అందుకనే స్వామివారు ఇలా తీర్మానించారు, “రేపటి నుండి మొదటికాల పూజ ఉదయం పది గంటల లోపు పూర్తిచేస్తాను. మీరందరూ భోజనం చేసిన తరువాత, నేను భిక్షావందన పూజ చేసి కొద్దిసేపటి తరువాత నేను భిక్ష చేస్తాను.” అప్పటినుండి ఇలా సిబ్బందికి అనుకూలమైన సంప్రదాయం శ్రీమఠంలో మొదలైంది. --- ఎన్. వెంకట్రామన్, మైలదుతురై. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం0,00%
  • 11 авг.అందుకు ఒకరు వస్తారు 1945 ఫెబ్రవరిలో పరమాచార్య స్వామివారు రాణీపెట్టైలో మకాం చేస్తున్నారు. అక్కడ నివసించేవారు దాదాపుగా హైందవేతరులే అయినా కులమతాలకతీతంగా మహాస్వామివారి దర్శనానికి వచ్చేవారు. రాణీపెట్టై సమీపంలోని నావల్పూర్ ప్రజలు “కరుమారుయమ్మన్ దేవి” ఆలయం కట్టడానికి లక్షలలో నిధులు కావాలని గ్రహించి కాస్త కలత చెందారు. పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం వారు స్వామివారి దర్శనానికి వచ్చారు. “మేము ఒక మంచి కార్యక్రమం చెయ్యలనుకున్నాము. దానికి కావాల్సిన నిధులు మావద్ద సమృద్ధిగా లేవు. పరమాచార్య స్వామివారు మమ్మల్ని అనుగ్రహించాలి“ అని వేడుకున్నారు. స్వామివారు కొద్దిసేపు మౌనం వహించి, “కోవెల అమ్మవారికి. కదా? ఆమెయే చూసుకుంటుంది” అని చెప్పారు. “మాకు ఆ నమ్మకం ఉంది కాని కావాల్సిన ధనంలో పాతికవంతు కూడా సేకరించలేకపోయాము. . . ”. అందుకు మహాస్వామివారు “నేలపై నాలుగడుగుల ఎత్తున నిర్మాణం చెయ్యండి” అని చెప్పారు. ”మరి గోపురం, విగ్రహాలు, కుంబాభిషేకం మొదలగువాటికి ఎలా?” అని అడిగారు వారు. ”వాటన్నిటి కోసం ఒక వ్యక్తి వస్తాడులే” అన్నారు. వారికి ఒక దేవరహస్యం అవగతమైంది. కాని “ఎప్పుడు వస్తాడు? ఎలా గుర్తుపట్టాలి?” అని పలు సందేహాలతో సంతోషంతో ప్రసాదం స్వీకరించి, అనుమానంతో, కలతతో వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగినది ఫెబ్రవరి 14, 1945న. మరి ఆ వ్యక్తి ఆరోజు ఎక్కడున్నాడు? 1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం 1945 వరకు కొనసాగింది. అలీన సేనలు బర్మాలోని ఐరావతి నది వద్ద జపాన్ తో తలపడుతున్నాయి. జపాన్ సైన్యం తూర్పు ఒడ్డున, అలీన సేనలు పశ్చిమ ఒడ్డున పోరాడుతున్నాయి. అలీన సేనలకు ఆ ప్రాంతము, ఆ వాతావరణము అంతగా అలవాటు లేదు. నదీజలాల దగ్గర యుద్ధం చేయగల నైపుణ్యం కలిగిన వారిని ఇక్కడకు పంపవలసిందిగా అలీన సేనలకు నాయకత్వం వహిస్తున్న మేజర్ లండనుకు అత్యవసర సమాచారం పంపారు. అటువంటి యుద్ధనైపుణ్యం కలిగిన బెటాలియన్ మడగకార్. ఆ సైనిక దళాన్ని వెంటనే ఐరావతికి పంపారు. భారత సైనికులను ఒడ్డుకు పంపి వారు నదిలోకి దిగారు. ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేని జపాన్ సేనలు రాక్షసులుగా మారి ఒడ్డున ఉన్నవారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఆ ఊతకోచలో కేవలం ఒక్కరే బ్రతికి బయటపడ్డారు. ”నేను ఒక్కడినే ఎందుకు బ్రతికాను దేవుడా?” 1945 మేలో జెర్మనీ ఓటమితో యుద్ధం ముగిసింది. ఐరావతి యుద్ధంలో బ్రతికి బయటపడ్డ మేజర్ నారాయణస్వామి, సైన్యం నుండి విరమణ పొందిన తరువాత భార్య చంద్రికతో కలిసి రాణిపెట్టైలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఒకరోజు సాయింత్రం వారు నడుడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా అసంపూర్తిగా ఉన్న మందిరాన్ని ఆరుబయట అలా ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న అమ్మవారిని చూశారు. “చూడు! నన్ను ఎలా వదిలేశారు. నేను అంతటి భయంకర యుద్ధం నుండి నిన్ను కాపాడితే, నాకు ఒక నీడ కల్పించవా” అని అమ్మవారు అడిగినట్టు అనిపించింది. మహాస్వామివారి దర్శనానికి వచ్చిన ఆ భక్తులందరి ఆనందభాష్పాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. ”ఈయన మిలటరి మేజర్ నారాయణస్వామి, ఆవిడ ఈయన భార్య. ఆలయ నిర్మాణాన్ని వారు పూర్తిచేసి, కుంబాభిషేకం కూడా చెయ్యడానికి ముందుకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం అచ్చం స్వామివారు చెప్పినట్టుగానే” పరమాచార్య స్వామివారి ‘కరుణాకటాక్షం’ ఆ దంపతులపై ప్రసరించి వారిని పునీతులను చేసింది. --- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 7 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం0,00%
  • 10 авг.స్వామివారి ఆహార విహారాదులు స్వామివారు సంవత్సరమంతా సగం రోజులు ఆహారమే తీసుకునేవారు కాదు. నవరాత్రులు తొమ్మిదిరోజులూ కటిక ఉపవాసం. ఏకాదశి ఉపవాసం. ఆ తరువాత రోజూ సాయంకాలం త్రయోదశి అంటే మహాప్రదోషంలో అభిషేకం ఉన్నది కాబట్టి ఉపవాసం. తరువాతి రోజు యాదృచ్ఛికంగా శుక్రవారం అయితే మళ్ళీ సాయింత్రం అభిషేక పూజ నవావరణార్చన ఉంటాయి కాబట్టి మళ్ళీ ఉపవాసం. ఇవన్నీ అయిన తరువాత పౌర్ణమి వస్తుంది కదా! మళ్ళీ అభిషేకం - నవారణార్చన. ఇవి పూజకు సంబంధించిన నియమాలు. ఇవికాక నైతికమైన విషయాలలో కొన్ని ఉపవాసాలుండేవి. 1926లోనూ, 1953లోనూ, కొన్ని మాసాల తరబడి ఉపవాసం చేశారు. పోనీ విశ్రాంతి తీసుకునేవారా అంటే రాత్రి పదకొండూ పన్నెండింటివరకూ కార్యక్రమాలుండేవి. చాలారోజులు మేనాలోనే పడక. మేనా నిండా పుస్తకాలు. కాళ్ళు జాపుకోవడానికే వీలులేదు. విశ్రాంతిలో కూడా మత్స్యాసనంలో ఉండేవారు. రెండు మూడు గంటల తరువాత కార్యక్రమాలు మళ్ళీ మొదలు. ఇది ఎలా సాధ్యమయింది. విశ్వామిత్రుడు రామచంద్రుల వారికి బల అతిబల అనే విద్యలు ప్రసాదించాడట. మరి స్వామివారికి అంబిక ఏమి ప్రసాదించిందో! పోనీ తినేరోజులలో స్వామివారేమి పుచ్చుకొనేవారు? పధ్నాలుగు సంవత్సరాలకు ఉప్పు, చింతపండు, మిరపకాయలు తినడం మానివేశారట. చప్పిడి తినేవారు. ఆ తరువాత కేవలం పచ్చి ఆవుపాలతో ఉండేవారట. కొన్ని రోజులు కేవలం బిల్వ దళాలు, కొన్నిరోజులు వేపచివుళ్ళతో కాలక్షేపం చేశారట. కొంతకాలం మూడేమూడు గుప్పెళ్ళు అన్నం తినేవారట. ఆంధ్రపర్యటన కాలంలో (1967 - 69) వారు తీసుకుంటున్నది పెరుగులో నానబెట్టిన పేలాలు. ఇలా ఉండగా ఔత్తరాహికుడైన సన్యాసి ఒకరు పేలాలు కూడా జీవహింసే కదా అన్నాడట. బీజాన్ని వేయిస్తున్నారు కదా! మరి అయితే యతులు ఏమి తినాలనే విషయం మీద ఆయనతో పెద్ద మీమాంస చేసి, పేలాలు కూడా మానివేసి అరటిపళ్ళపొడి ఆవుపాలతోనో, పళ్ళరసంతోనో కలిపిగానీ, దానినే ఇడ్లీల వలె ఉడకబెట్టి ఇస్తే స్వీకరించేవారు. చివరి సంవత్సరాలలో శ్రీవారి భిక్ష ఇదే! ఒక్క అన్నద్వాదశి నాడు మాత్రమే అన్నభిక్ష స్వీకరించేవారు. ఆధునిక వైజ్ఞానిక పరంగా ఆలోచిస్తే వారు చేసే పనికి, వారు తీసుకునే క్యాలరీలు సరిపోవు. కానీ వారి బలం యౌగికమైనది. లౌకికమైనది కాదు. అది వారు అనేక సందర్భాలలో నిరూపించారు. పంచ ప్రాణములలో ఒక వాయువును ప్రకోపింపచేయగల యోగక్రియ వలన ఇటువంటి మహత్తు సాధ్యపడుతుందని శ్రీశివానందమూర్తి గారితో ముచ్చటించినప్పుడు అన్నారు. చాలాకాలం ఉపవాసం చేసిన స్వామి ఉపవాసం ముగిసే రోజున ఉదయం నుండే ‘ఆకలి, ఆకలి’ అంటూ తొందరపెట్టేవారట. పూజ ముగిసి నియమ బ్రాహ్మణులకు ఔపోసన పోసిన తరువాత వీరి ఆకలి మాయం ఆయ్యేది (కామకోటి మఠపు ఆస్తులు పూర్వపు రాజులచేత బ్రాహ్మణ సంతర్పణకు, దీపారాధనకు అని ప్రత్యేకంగా ఈయబడినాయి. అందువల్ల ప్రతిరోజూ, నియమంగా కొంతమంది వేదపండితులకు ఔపోసన అయినతరువాతే పీఠాధిపతులు భిక్షకు వెళతారు). ఇక భిక్ష ఏర్పాటు చేసే పరిచారకుడు ఎన్నిసార్లు కనిపించినా సాయంకాలం వరకూ పట్టించుకొనేవారే కాదట. స్వామి అప్పుడప్పుడు సంభాషణలో చెబుతూ ఉండే మాట గుర్తుకువస్తోంది. “పసిపిల్లవాడు బొద్దుగా ఉంటే అందం. సన్యాసి వడిలి ఉంటే అందం” --- శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి, ఋషిపీఠం ప్రచురణ #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం0,00%
  • 9 авг.ఏమీ అర్థం కాక ప్రశ్నార్థకంగా స్వామివారిని, బాలు మామను మార్చి మార్చి చూస్తున్నాడు. ఇక చేసేదేమీ లేక స్వామివారికి ఏ ఆపదా రాకూడదని మనసులోనే ప్రార్థిస్తున్నాడు. స్వామివారు వీళ్లిద్దరి ఆలోచనలు, అనుమానాలు, భయాలు ఏమీ పట్టించుకోకుండా దూరంగా ఉన్న కొండపై ఉన్న శివాలయం కేసి చూస్తున్నారు. అంతలోనే ఆకాశంలో తీవ్రమైన మార్పులు సంభవించాయి. హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. సన్నటి ఉరుములు, మెరుపులతో మొదలై చిన్నగా చినుకులు మొదలయ్యాయి. చినుకులు వానగా మారి, అంతలోనే జడివానగా కురవసాగింది. చేతులు జోడించి నమస్కరించి, కళ్లలో నీరు రాలుతుండగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ గొంతు మూగబోయింది. మహాస్వామితో సహా అందరూ వర్షంలో తడిచిపోయారు. ఊరివారందరూ స్వామివారు ఉన్న చోటుని వెతుక్కుంటూ అక్కడకు చేరుకున్నారు. కానీ ఆ వర్షంలో తడిసి వారి అహంకారమూ, అజ్ఞానమూ, కోపావేశమూ వర్షపునీటిలో కొట్టుకుపోయాయి. “కర్రలు పడేయండి. ఈయన సాధారణ సన్యాసి కాదు. దేవుడు. మనల్ని ఈ కరువు నుండి కాపాడడానికి వచ్చిన దేవుడు” అని గ్రామపెద్ద ఆజ్ఞాపించడంతో కర్రలు పారవేసి అందరూ స్వామివారి వద్దకు చేరుకున్నారు. “ఈ స్వామి గురించి మనం తప్పుగా మాట్లాడాము. నేను కూడా ఈయన పాదాలపై పడి మన తప్పును క్షమించమని వేడుకుందాము” అని అందరూ సంపూర్ణ శరణాగతితో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామివారు నవ్వుతూ, “వర్షం జోరుగా కురుస్తోంది. ఈ రాత్రికి అందరూ ఇక్కడే ఉండండి. ఉదయం వెళ్లవచ్చు” అని చేయెత్తి అందరినీ ఆశీర్వదించి, బాలు మామ తోడురాగా స్వామివారు లోపలికి వెళ్లిపోయారు. ఆ రాత్రి మొత్తం కరువు తీరేలా కురిసిన వర్షానికి వారి కరువు తీరిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు! --- “మహా పెరియవా” సంకలనం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। దీవ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం కాంచీశ్వరీ రుచిర చిత్కళయా సుదీప్తం దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం0,00%
  • 9 авг.“మనం ఆ స్వామివారి మాట విని, మనమందరం రేపు ఉదయం ఒక బిందె తీసుకుని పక్క ఊరికి వెళ్లి నీరు తెచ్చుకుందాము. ఈలోగా మనలో ఒకరు ఆ కొండ ఎక్కి ఆ శివాలయాన్ని వెతుకుదాము. అందరమూ తలా ఒక బిందెడు నీరు కొండపైకి తీసుకువెళ్దాము. లేకపోతే ఆ తెచ్చిన నీటిని మన ఇంటి అవసరాలకు వాడుకుందాము” అని చెప్పగా, అందరూ ఆ ముసలాయన మాటలకు సమ్మతించి మెల్లగా అక్కడినుండి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ప్రతి ఇంటి నుంచి ఒకరు, ఇద్దరు, ముగ్గురు—అలా అందరూ కలిసి పక్క గ్రామానికి వెళ్లి 1008 బిందెల నీరు తీసుకురావడానికి వెళ్లారు. ఇంతలో ఇద్దరు కొండపైకి ఎక్కి ఆ శివాలయాన్ని కనుక్కున్నారు. అందులో ఉన్న శివలింగం చాలా అద్భుతంగా ఉంది. వారిద్దరూ అక్కడి పరిసరాలను శుభ్రపరిచారు. స్వామివారు చెప్పే వరకు వారికి అసలు తెలియని ఈ శివాలయం గురించి ఎంతో అబ్బురపడ్డారు. గ్రామస్తులందరూ అతి కష్టం మీద 1008 బిందెలతో కొండపైకి ఎక్కి అభిషేకం పూర్తిచేశారు. బహుశా ఈ చర్య శివయ్యను తృప్తిపరచి ఉంటుంది. గ్రామస్తులందరూ ఇళ్లకు తిరిగొచ్చి ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. అభిషేకం చేస్తే వర్షం వస్తుందని స్వామివారు చెప్పారు. అభిషేకం చేశాము కానీ వర్షం జాడ కూడా లేదే అని అందరూ ఆలోచిస్తున్నారు. కొద్దిసేపటి తరువాత వారు మోసపోయామని నిర్ధారణకు వచ్చారు. “ఆ స్వామి మాటలు విని ఇంత కష్టపడి అభిషేకం చేస్తే వర్షం రాలేదు. ఆ స్వామి మనల్ని మభ్యపెట్టారు” అని కోపంగా అన్నాడు ఒక గ్రామస్తుడు. వెంటనే ఆ గ్రామపెద్ద కూడా కోపంతో, “అవును, ఆ సన్యాసి మనల్ని మోసం చేశాడు. వారిని అలా వదిలేయకూడదు. పక్క గ్రామంలోనే ఉంటామని చెప్పారు కదా! పదండి వెళ్దాం. అందరూ కర్రలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితిలోనూ వాళ్లను ఇవాళ వదిలిపెట్టకూడదు. వాళ్లో మేమో తేలిపోవాలి ఈరోజు” అని ఊగిపోతూ అందరినీ రెచ్చగొట్టాడు. పది నిమిషాల్లో అందరూ మరలా ఒక్కచోటికి వచ్చారు. ఒక చేతిలో కర్ర, మరొక చేతిలో టార్చ్‌తో. అందరూ ఆవేశంతో ఉన్నారు కానీ కనీసం ఆలోచన కూడా చేయడం లేదు—మనం చేస్తున్న ఈ పని సరైనదేనా అని. ఎన్నో సంవత్సరాలుగా అసలు ఎవరికీ తెలియని స్వామివారు, ఇక్కడివారు కాకపోయినా అక్కడ శివాలయం ఉందని చెప్పిన స్వామివారిని కొట్టడానికి వెళ్తున్నాము, ఇది తప్పు అన్న వివేకం అసలు లేదు. అంతమందిలో ఒక్కడు మాత్రం మిగిలినవాళ్లలా కాకుండా, కాస్త ఆవేశం చల్లబడిన తరువాత, “స్వామివారిని కొట్టడానికి వెళ్లడం సరికాదు. వారు చెప్పిన విషయం జరగలేదన్న ఒక్క కారణంతో వాళ్లందరినీ కొట్టడం తప్పు. కానీ నేను ఇప్పుడు ఇలా చెబితే వీళ్లందరూ నన్ను కొడతారు” అని అనుకున్నాడు. ఇక్కడి నుండి స్వామివారు మకాం చేస్తున్న ఊరు ఐదు కిలోమీటర్లు. తాను దగ్గరి దారిలో వెళ్తే వీళ్లందరికంటే ముందే వెళ్లి స్వామివారికి ఈ విషయం చెప్పవచ్చు అనుకున్నాడు. కొద్దిగా మెల్లగా నడుస్తూ, కొంచెం కొంచెంగా గుంపు నుండి వెనకపడి, ఎవరికీ అనుమానం రాకుండా అవకాశం రాగానే మరొక దారిలో నడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అరగంట తరువాత స్వామివారున్న చోటు చేరుకున్నాడు. ఊరిజనం రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దాదాపు అందరూ నిద్రకు ఉపక్రమించడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ఎవర్ని పలకరించాలో ఇతనికి అర్థం కాలేదు. ఈ విశ్వంలో జరిగే ఏ విషయమైనా పరమాచార్య స్వామివారికి తెలుసు. బాలు మామను పిలిచి, “పక్క ఊరి వ్యక్తి బయట నీకు కనిపిస్తాడు. వెంటనే ఇక్కడకు తీసుకురా” అని చెప్పారు స్వామివారు. బాలు మామ బయటకు వెళ్లగానే ఇతను కనబడ్డాడు. బాలు మామకు విషయం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగా, అదేమీ పట్టించుకోకుండా అతణ్ని రమ్మని పిలిచి చేయిపట్టి లాక్కునివెళ్లి స్వామివారి ముందుంచాడు. అతని ఆనందాశ్చర్యానికి అవధులు లేవు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని, స్వామివారు ఊరి నుండి వెళ్లిపోయిన తరువాత నుండి ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు అన్నీ వివరంగా చెప్పాడు. ఊరివారందరూ వస్తున్నారన్న విషయం వినగానే బాలు మామ వణికిపోయి, వెంటనే బయటకు తొంగి చూశాడు. కనుచూపుమేరలో ఎవరూ లేకపోవడంతో కాస్త కుదుటపడ్డాడు. మహాస్వామివారు మాత్రం, “అవునా, అలాగా?” అని చల్లగా నవ్వుతూ బయటకు వెళ్లారు. బాలు మామకి ఏమీ అర్థం కావడంలేదు. “ఈ మంచివ్యక్తి మన బాగుకోసం అన్ని విషయాలు చెబితే, ఆత్మరక్షణ కోసం ఏమీ ఆలోచించకుండా చల్లగా బయటకు వచ్చి నిలబడ్డారు స్వామివారు. అసలు ఈ సమయంలో బయటకు రావడం ఎందుకు? వారు వచ్చేలోపు అమూల్యమైన ఈ సమయాన్ని వృథా చేయడమెందుకు?” అని అనుకున్నాడు. కొంచెం ధైర్యం తెచ్చుకుని, “చూస్తూ ఉంటే ఆ వచ్చే గుంపు మనం చెప్పే మాటలు వినేటట్టుగా లేరు. మనల్ని ఈ ఊరికి ఆహ్వానించినవారి వద్దకు వెళ్లి, విషయం మొత్తం చెప్పి, మనకు రక్షణగా కొందరిని తీసుకుని వచ్చేదా?” అని అడిగాడు. స్వామివారు మౌనంగా నిలబడ్డారు. ఆ గ్రామస్తునికి ఏమీ అర్థం కావడం లేదు. “నేను ఇక్కడకు వచ్చి విషయం ముందుగా చెబితే స్వామివారికి సహాయం అందరూ రక్షణ కోసం ఏదైనా చేస్తారని అనుకున్నాను. కానీ స్వామివారిలో ఏమాత్రం ఆందోళన లేదు. చూస్తుంటే కోపంతో ఊగిపోతున్న ఆ గుంపుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు” అనుకున్నాడు.0,00%
  • 9 авг.మా ఊళ్ళో వర్షం పడుతుందా? కంచి కామకోటి పీఠం పీఠాధిపతుల్లో ఎందరో పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ భారతదేశం నలుమూలలకు వెళ్లి ధర్మప్రచారం చేసి జనులను అనుగ్రహించారు. బయటి ప్రపంచానికి తెలియని మారుమూల పల్లెలను కూడా వారు తమ యాత్రలో దర్శించి, లక్షల మందిని ధర్మానికి చేరువ చేశారు. అలాగే పరమాచార్య స్వామివారు కూడా తమ జీవితకాలంలో ఎన్నో మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. స్వామివారి అటువంటి ఒక యాత్ర బెల్గాంక్‌కు. కర్ణాటకలో ఉన్న ఈ ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. మహాస్వామివారు ఆ జిల్లాలోని ఒకానొక మారుమూల పల్లెలో తమ పరివారంతో పర్యటిస్తున్నారు. ఆ యాత్రలో భాగంగా స్వామివారు ఎందరో అమాయక పల్లెటూరి ప్రజలను కలిశారు. ఈ యాత్రలో స్వామివారి ముఖ్య సేవకుడు రాయవరం బాలు మామ. వారు ప్రస్తుతం వెళ్తున్న ప్రాంతం వర్షాలు లేక భూములు ఎండిపోయి, అత్యంత తీవ్రమైన నీటి ఎద్దడితో ఉండి, ఎక్కడా పచ్చదనమే లేని భూభాగం. చూద్దామంటే కూడా ఎక్కడా ఒక్క నీటి చుక్క కూడా కనబడదు. అక్కడి ప్రజల పరిస్థితి, ముఖ్యంగా నీటికష్టాలు, వర్ణనాతీతం. అటువంటి ఈ ఎడారి ప్రాంతంలో మహాస్వామివారు దండం చేతబట్టుకుని, భరించలేని ఈ ఎండలో, శరీరంపై ఏమాత్రం స్పృహ లేకుండా, చాలీచాలని వస్త్రాలతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అటువంటి స్వామిని వారు ఎన్నడూ చూడకపోవడంతో ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. క్షణాల్లో దాదాపు నలభై మంది స్వామివారి బృందాన్ని చుట్టుముట్టారు. ఇక ముందుకు అడుగువేయడానికి కుదరకపోవడంతో స్వామివారు నిలబడిపోగా, బాలు మామ కూడా ఆగిపోయారు. స్వామివారు వారిని చూడగానే వారు అడగబోయే సందేహాలను అర్థం చేసుకున్నారు. “ఈ సాధువు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? తోడుగా ఉన్నవారు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు?” స్వామివారు బాలు మామ వైపు తిరిగి, “వారు కేవలం మనం ఎవరో తెలుసుకోవాలని చుట్టుముట్టారు. కొట్టడానికి వచ్చారనుకున్నావా?” అని పరిహాసం చేస్తూ, “మనం ఎవరో, ఎక్కడికి వెళ్తున్నామో వివరంగా చెప్పు” అని ఆదేశించారు. వెంటనే బాలు మామ అక్కడున్నవారితో, “వీరు కంచి పరమాచార్య స్వామివారు. మాకు గురువులు. జగద్గురువులు కూడా. మన కష్టాలను స్వామివారి ముందు పెడితే అవి క్షణాల్లో మాయం అవుతాయి. మేమందరం తమిళనాడులోని కాంచీపురం నుండి వస్తున్నాము. దేశసంచారం చేస్తూ మీ పక్క ఊరికి వెళ్తున్నాము. అక్కడ కొన్ని రోజులు ఉంటాము” అని చెప్పారు. ఈ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెళ్లాల్సిన ఊరు ఉంది. బాలు మామ చెప్పడం ముగించగానే, ఆ గుంపులో నుండి భారీ కాయుడైన ఒక వ్యక్తి, బహుశా ఊరి పెద్ద అనుకుంటా, ముందుకు వచ్చి స్వామివారికి ఎదురుగా నిలబడ్డాడు. అతడు బాలు మామ వైపు వేలు చూపిస్తూ, “ఇతను చెబుతున్నాడు, మీరు ఏది అడిగితే అది ఇస్తారని. మాకు ఇప్పుడు అత్యవసరంగా ఒకటి కావాలి. చాలా ఏళ్లుగా ఇక్కడ కరువు తాండవిస్తోంది. వర్షాలు లేక వ్యవసాయం ఆగిపోయింది. మాకు వర్షం కురిపించగలరా?” అని ఆదేశించినట్టుగా అడిగాడు. స్వామివారు ప్రశాంతంగా అతని వైపు చూశారు. చుట్టూ ఉన్న అందరినీ గమనిస్తూ, కనుచూపుమేరలో కనిపిస్తున్న ఒక కొండను చూపిస్తూ, “ఆ కొండపైన శివాలయం ఉందా?” అని అడిగారు. అక్కడున్నవారందరూ స్వామివారు చూపించినవైపు చూసి, వారెవరికీ ఆ విషయం తెలియనట్టు నిలబడ్డారు. స్వామివారిని ప్రశ్నించిన వ్యక్తి కొందరు ముసలివారిని ఆ విషయమై అడగగా, ఎవరూ తెలియదన్నారు. ఎవరూ చెప్పకపోవడంతో అక్కడ శివాలయం లేదని, దాని గురించి ఎవరికీ తెలియదని చెప్పాడు. “అక్కడ శివాలయం ఉంది” అని నిక్కచ్చిగా చెప్పారు స్వామివారు. “చాలా ఏళ్లుగా అక్కడి శివయ్యకు అభిషేకం లేక నీటి కోసం అలమటిస్తున్నాడు. మీ ఊరివారందరూ కలిసి 1008 బిందెల నీటితో ఆ శివలింగానికి అభిషేకం చేస్తే, మీ సమస్య తీరుతుంది” అని చెప్పి స్వామివారు ముందుకు కదిలారు. ఆ విషయాన్ని అక్కడితో వదలడానికి ఇష్టపడని ఆ గ్రామపెద్ద, “స్వామి! మాకు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. తాగడానికి, నిత్యావసరాలకు కూడా పక్కన ఉన్న ఊరిపై ఆధారపడ్డాము. మాకు అన్ని బిందెల నీళ్లు ఎలా వస్తాయి?” అని అడిగాడు. అంతేకాదు, అంత నీరు ఉంటే ఇంటి అవసరాలకు వాడుకుందాము అనుకుంటారు కానీ అభిషేకం చేయాలనుకోరు అని స్వామివారితో వాదించడం చూసిన స్వామివారి సేవకులు అతని ప్రవర్తనను చూసి విసుగుచెందారు. “స్వామివారు చెప్పింది విని పాటించక, ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు?” అని వాళ్లలో వారు మాట్లాడుకుంటున్నారు. కానీ స్వామివారు మాత్రం, “శివయ్యకు అభిషేకం చేయండి. అంతా మంచి జరుగుతుంది” అని కాస్త పెద్ద పెద్ద అడుగులతో నడవడంతో పరివారం కూడా నడక వేగాన్ని పెంచారు. ఏమీ తోచక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్న వారిలో ఒక ముసలి వ్యక్తి ముందుకు వచ్చి, “మనతో మాట్లాడిన ఆ స్వామి మొహంలో తేజస్సును చూస్తే, వారు చెప్పినది నిజమనిపిస్తోంది. ఇప్పుడు ఆలోచిస్తే, చిన్నప్పుడు మా నాన్నవాళ్లు మాట్లాడిన మాటల వల్ల, నాకు కూడా అక్కడ శివాలయం ఉండి ఉండవచ్చనిపిస్తోంది. మనం చూడలేదు కాబట్టి అక్కడ ఆలయం లేదు అనుకోవడం సబబు కాదు.0,00%
  • 8 авг.Photo from Rajavikram Paruchuru0,00%