TeluguISM
СтатистикаWe report the latest political, social, traditional, cultural and entertainment NEWS of the Telugu States.
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 42
- Всего постов
- 42
- Тип
- открытый
- Язык
- te
- Категория
- Политика
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 45
- 1/48двое суток
- 51
- 1/72трое суток
- 55
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థుల ఖాతాల్లో ముందస్తుగానే జమ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాల్లో ఈ డబ్బును ముందస్తుగా జమ చేస్తామని వెల్లడించారు.నెక్లెస్ రోడ్ సమీపంలోని హెచ్ఎండీ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే ,… https://teluguism.com/fee-reimbursement-funds-are-deposited-every-year/ #TeluguISM
నల్లగండ్ల చెరువు పునరుద్ధరణకు రైతుల సహకారం హైదరాబాద్ : నల్లగండ్ల చెరువు పునరుద్దరణ పనుల కోసం రైతులు సహకరించేందుకు ముందుకు రావడం పట్ల అభినందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో రైతులతో కలిసి నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. మొత్తం 90 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువులో సుమారు 70 ఎకరాలు రైతుల పట్టా భూములే ఉన్నాయన్నారు. ఇవన్నీ చెరువు పూర్తి నీటి మట్టం పరిధిలోకి వస్తుండటంతో చెరువు సమగ్ర అభివృద్ధికి సహకరించేందుకు రైతులు స్వచ్ఛందంగా… https://teluguism.com/farmers-cooperation-for-the-restoration-of-nallagandla-lake/ #TeluguISM
www.teluguism.com #TeluguISM
100 రోజుల్లో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులతో రికార్డ్ చెన్నై : సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని టీవీకే కూటమి సర్కార్ అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఏకంగా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులను సాధించింది. రాష్ట్ర చరిత్రలో ఇదో అద్భుతమైన ఘట్టమని పేర్కొన్నారు సీఎం. పారిశ్రామిక వృద్ధిని పెంచేందుకు అధిక విలువ కలిగిన రంగాలపై రాష్ట్రం దృష్టి సారిస్తోంది. పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులు, లైసె న్సులు , ‘నో-అబ్జెక్షన్’ సర్టిఫికెట్ల జారీకి 21 రోజుల గడువును తమిళనాడు… https://teluguism.com/record-with-investments-of-rs-1-lakh-crore-in-100-days/ #TeluguISM
అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ పూర్తి హైదరాబాద్ : మహిళలు, చిన్నారుల సంక్షేమానికి విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాల సాధనలో టీజీఎస్పీడీసీఎల్ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా, టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సదుపాయాలు కల్పించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణ,… https://teluguism.com/electrification-of-anganwadi-centers-completed/ #TeluguISM
మార్కెట్లలో ఆర్ డి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి హైదరాబాద్ : మార్కెట్లలో ఆర్డీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని, రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను… https://teluguism.com/the-on-demand-rd-system-in-the-markets-must-be-completely-eradicated/ #TeluguISM
తెలంగాణలో ఘనంగా ఖేలో ఇండియా’ క్రీడల నిర్వహణ హైదరాబాద్ : తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలు నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర మత్స్య, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. తనను కలిసిన వారిలో మంత్రి శ్రీహరితో పాటు ప్రభుత్వ సలహాదారు ఎ.పి. జితేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి ఉన్నారు. తెలంగాణకు ‘ఖేలో ఇండియా’ క్రీడలను కేటాయించినందుకు గాను… https://teluguism.com/khelo-india-games-conducted-grandly-in-telangana/ #TeluguISM
ఎంపీడీఓలు అంకితభావంతో పని చేయాలి : జి. చిన్నారెడ్డి హైదరాబాద్ : అధికారులు తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటామనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదని అన్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రాథమిక లక్ష్యంగా అంకితభావంతో, బలమైన బాధ్యతా స్ఫూర్తితో తమ విధులను నిర్వర్తించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మండల నోడల్ అధికారులుగా నియమితులైన 560 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించారు.… https://teluguism.com/mpdos-must-work-with-dedication-g-chinna-reddy/ #TeluguISM
జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రులు వీరే హైదరాబాద్ : టీపీసీసీ కీలక ప్రకటన చేసింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే మంత్రులు, ప్రముఖులను ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది.హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30… https://teluguism.com/these-are-the-ministers-who-will-hoist-the-national-flag/ #TeluguISM
సర్ ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి అమరావతి : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సర్ పై సీరియస్ గా స్పందించారు. ఈ ప్రక్రియలో భాగంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంచార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ వరకు సరైన బాధ్యత తీసుకోక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత ఇంచార్జ్ మంత్రులు జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులతో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.… https://teluguism.com/sir-we-need-to-be-vigilant-regarding-the-deletion-of-votes/ #TeluguISM
రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ : సీఎం అమరావతి : : సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో, అమరావతి నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని సీఎం స్పష్టం చేశారు. ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ – మంగళగిరి – గుంటూరులతో కలిపే కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటి ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు… https://teluguism.com/seed-access-road-the-royal-route-to-the-capital-cm/ #TeluguISM
దళిత వ్యతిరేక విధానం బీజేపీ ఎజెండా : షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేసిన హవనందళితుల వ్యక్తిత్వానికి జరిగిన హననం అని పేర్కొన్నారు.దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం అని, దళిత వ్యతిరేక విధానం బీజేపీ ఎజెండా అని మండిపడ్డారు. కులవివక్ష, కులమతాల మధ్య విభేదాల సృష్టించడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేజీ అడుగుపెట్టిన స్థలాన్ని శుద్ధి చేశారంటే… https://teluguism.com/anti-dalit-policy-is-the-bjps-agenda-sharmila-reddy/ #TeluguISM
www.teluguism.com #TeluguISM
సర్ ప్రక్రియలో ప్రముఖ సినీ తారలు హైదరాబాద్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు గ్రేటర్ హైదరాబాద్లోనే తమ ఓటర్ నమోదును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అనేకమంది ప్రముఖులు జూబ్లీహిల్స్ , దాని పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలోని సుమారు 98% మంది సినీ ప్రముఖులు తమ వివరాల నమోదు ఫారమ్లను పూర్తి చేసి, బూత్ స్థాయి… https://teluguism.com/prominent-film-stars-in-the-survey-process/ #TeluguISM
యువతకు కన్నా లక్ష్మీనారాయణ ఆదర్శం రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. గుంటూరు లో గురువారం ఘనంగా జరిగిన ‘కన్నా’ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, ఆయన 73వ జన్మదిన మహోత్సవ వేడుకలకు అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి గెలవడం కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా ఆరుసార్లు… https://teluguism.com/kanna-lakshminarayana-is-a-role-model-for-the-youth/ #TeluguISM
రూ. 67,000 కోట్ల విలువైన 97 ఒప్పందాలు : సీఎం చెన్నై : తమిళనాడు సర్కార్ కీలక ముందడుగు వేసింది. సీఎం విజయ్ సారథ్యంలో పలు కీలక ఒప్పందాలు వివిధ సంస్థలతో చేసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో రూ. 67,000 కోట్ల విలువైన 97 ఒప్పందాలు చేసుకోవడం విశేషం. లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ ఎంఓయులు చేసుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. మే నెలలో ‘తమిళగ వెట్రి కళగం’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి వెట్రి తమిళనాడు… https://teluguism.com/97-agreements-worth-rs-67000-crore-cm/ #TeluguISM
అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్ సిద్దం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు వంతెనను గురువారం ప్రారంభించారు. 60 మీటర్ల వెడల్పు, తొమ్మిది లేన్లతో కూడిన ఈ రహదారిని మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు . ఇందులో ప్రత్యేక బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ , సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. గుంటూరు జిల్లాలో ‘గ్రీన్ ఫీల్డ్’ రాజధాని నగరానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేలా… https://teluguism.com/seed-access-road-connecting-amaravati-is-ready/ #TeluguISM
కొత్త ఆలోచనలతో వస్తే మద్దతు ఇస్తాం : నాగార్జున హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరలో అత్యంత జనాదరణ పొందిన నటుడిగా గుర్తింపు పొందారు అక్కినేని నాగార్జున. ఈ సందర్భంగా ఔత్సాహికులకు మేలు జరిగేలా కీలక ప్రకటన చేశారు. కొత్త ఆలోచనలతో వచ్చే వారికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఒక గేమ్ ఛేంజర్ కావచ్చని సినిమా రంగానికి చెందిన ప్రముఖులు. ఇదిలా ఉండగా తక్కువ బడ్జెట్ చిత్రాలకు మద్దతు ఇవ్వడంలో పేరున్న నిర్మాత రాజ్ కందుకూరి, నాగార్జున… https://teluguism.com/we-will-extend-support-if-you-come-up-with-new-ideas-nagarjuna/ #TeluguISM
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్తో ఒప్పందం అమరావతి : సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ – మద్రాస్కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ… https://teluguism.com/agreement-with-iit-madras-for-protection-of-uppada-coast/ #TeluguISM
3 దశల్లో రూ.1,519 కోట్లతో ఇ-3 రహదారి నిర్మాణం అమరావతి : రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్, బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీని కారణంగా రాజధానిలోకి రాకపోకలు మరింత వేగవంతం, సులభతరం కానున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక… https://teluguism.com/construction-of-e-3-highway-in-three-phases-at-a-cost-of-₹1519-crore/ #TeluguISM