tgindex
శివ గురునాథ ధర్మ వనం (SGDV)

శివ గురునాథ ధర్మ వనం (SGDV)

Статистика

ప్రస్తుతం ప్రతిరోజు శ్రీ శివమహాపురాణంలోని ఒక్కో అధ్యాయం పోస్ట్ చేయడం జరుగుతుంది. హర హర రామ శివ శివ కృష్ణ హర హర రామ శివ శివ కృష్ణ

Последний пост
24 июл.
Последнее чтение
14 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
te
В каталоге с
14 авг.
Подписчики
584
мало замеров
Замеров пока мало
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
289
20 постов
Вовлечённость
49,5%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
133
1/48двое суток
152
1/72трое суток
164

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • ​విష్ణువు నిద్రించే ఈ సమయంలో మనుషులు నేలపైనే పడుకోవాలి. శ్రావణ మాసంలో శాకాహారంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును వర్జించాలి. ఆశ్వయుజ మాసంలో పాలను, కార్తీక మాసంలో ద్విదళ ధాన్యాలను (పప్పు ధాన్యాలను) వదిలివేయాలి. లేదా ఈ సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అత్యున్నత స్థానాన్ని పొందుతారు. ఓ రాజా! ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మనిషి సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. కాబట్టి దీనిని ఎల్లప్పుడూ ఆచరించాలి, ఎప్పటికీ మరచిపోకూడదు. ​శయని ఏకాదశికి, ప్రబోధిని (కార్తీక) ఏకాదశికి మధ్య కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశులను గృహస్థులు తప్పక ఆచరించాలి. ఓ రాజా! పాపాలను హరించే ఈ మహత్తర కథను వినే మానవుడు అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలాన్ని పొందుతాడు." సర్వం శివార్పణమస్తు 🙏 శివాయ నమః🙏🙏 -Simple Telugu translation by AMV.

  • అరుణాచల శివ!! నమో వేంకటేశాయ!!! శ్రీ పద్మ మహాపురాణంలోని ఉత్తర ఖండంలోని 53వ అధ్యాయం ​ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయని ఏకాదశి) మహత్మ్యము ​యుధిష్ఠిరుడు పలికెను: ​"ఓ కృష్ణా! ఆషాఢ మాసము శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి ఏది? దాని పేరేమిటి? దానిని ఆచరించే విధానం ఎలాంటిది? దయచేసి దాని గురించి నాకు వివరంగా తెలపండి." ​శ్రీకృష్ణుడు పలికెను: ​2-8. "ఓ ధర్మరాజా! అత్యంత శుభప్రదమైనది, స్వర్గమోక్షాలను ప్రసాదించేది, సర్వపాపాలను హరించేది అయిన 'శయని' (తొలి) ఏకాదశి గురించి నీకు చెబుతాను విను. ఈ ఏకాదశి కథను కేవలం వినడం వల్లనే మనిషికి వాజపేయ యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది. నేను నీకు చెబుతున్నది పూర్తిగా నిజం. మానవులకు దీనికి మించినది మరొకటి లేదు. పాపుల పాపాలను నశింపజేయడానికి బ్రహ్మదేవుడు సృష్టించిన వ్రతాలలో ఇది అత్యుత్తమమైనది. మోక్షాన్నిచ్చే వ్రతాలలో దీనిని మించినది లేదు. ఈ కథను వినడం వల్లనే ప్రజలు ఉత్తమ గతులను పొందుతారు. ​నాపై అపారమైన భక్తిశ్రద్ధలు కలవారే వైష్ణవులు. ఆషాఢ మాసంలో భగవంతుడైన వామనుడిని పూజిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కమలాలతో కమలాక్షుడైన వామనుడిని పూజించినవారు, ఈ సమస్త జగత్తును, త్రిమూర్తులను (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను) పూజించినట్లే! అలాగే, విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవారు కూడా లోకమంతటినీ గౌరవించి, త్రిమూర్తులను ఆరాధించినంత ఫలాన్ని పొందుతారు." ​యుధిష్ఠిరుడు పలికెను: ​9-10. "ఓ విష్ణు భగవానుడా! నాకు ఇక్కడ ఒక పెద్ద సందేహం ఉంది. (దయచేసి) వినండి. మీరు మహాసముద్రంలో ఎలా నిద్రిస్తారు? బలిచక్రవర్తి వద్ద మీరు ఎలా నివాసముంటారు? మిగిలిన ప్రజలు ఏమి చేయాలి? ఓ బుద్ధిమంతుడా! ప్రజలు ఆ సమయంలో నేలపై ఎందుకు నిద్రించాలి? నాకు ఈ విషయమై పెద్ద సంశయం ఉంది, వివరించండి." ​శ్రీకృష్ణుడు పలికెను: ​11-16. "రాజశ్రేష్ఠా! పాపాలను నశింపజేసే మహా పుణ్యకథను విను. దీనిని వినడం ద్వారానే సమస్త పాపాలు నశిస్తాయి. పూర్వం త్రేతాయుగంలో బలి అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు నాపై తీవ్రమైన భక్తి కలిగి, ప్రతిరోజూ నన్ను పూజించేవాడు. రకరకాల యజ్ఞయాగాలు చేస్తూ నన్ను ఆరాధించేవాడు. మహత్తరమైన భక్తితో యజ్ఞాలు, వ్రతాలు ఆచరించాడు. ​అప్పుడు నేను ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇతర దేవతలతో చర్చించి, బలి నన్ను అనేక స్తోత్రాలతో పూజిస్తున్నప్పటికీ... విశ్వరూపధారినై, నా ఐదవ అవతారమైన వామన రూపంలో ఉపాయంతో రాక్షసులను జయించాలని తలచాను. అయితే బలిచక్రవర్తి మాత్రం తన సత్యనిష్ఠకే కట్టుబడి ఉన్నాడు. 'వచ్చినది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే' అని శుక్రాచార్యుడు వారించినా బలి వెనుకాడలేదు." ​17-26. "ఓ రాజా! నేను అతనిని మూడడుగుల నేల దానం అడిగాను. అతడు సంకల్పంతో నీటిని వదిలిన క్షణంలో, నా స్వరూపం ఎలా మారిందో విను: నేను 'భూః' లోకంలో నా పాదాలను, 'భువః' లోకంలో మోకాళ్లను ఉంచాను. 'స్వః' లోకంలో నడుమును, 'మహః' లోకంలో కడుపును ఉంచాను. 'జనః' లోకంలో హృదయాన్ని, 'తపః' లోకంలో మెడను ఉంచాను. 'సత్య' లోకంలో ముఖాన్ని ఉంచి, దానికి పైన నా శిరస్సును విస్తరించాను. ​చంద్రసూర్యాది గ్రహాలు, నక్షత్రాలు, ఇంద్రుడితో కూడిన దేవతలు, నాగ, యక్ష, గంధర్వ, కిన్నరులు వేద మంత్రాలతో నన్ను స్తుతించారు. నేను బలి చేతిని పట్టుకుని మూడడుగులతో సమస్త భూమండలాన్ని కొలిచాను. అప్పుడు మిగిలిన అర అడుగును అతని తలపై ఉంచాను. నా భక్తుడైన ఆ బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపాను. ఆ తర్వాత నేనేం చేశానో తెలుసా? అతని వినయ విధేయతలకు సంతసించి, ఆ విష్ణువు (నేను) ఎంతగానో ఆనందించాను. ​ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజున నా ఒక రూపం బలిచక్రవర్తి వద్ద పాతాళంలో ఉంటుంది. మరొక రూపం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు మహాసముద్రంలో శేషతల్పంపై శయనిస్తుంది. అంతవరకు మనుషులు ధర్మబద్ధంగా, తమ విధులకు కట్టుబడి ఉండాలి." ​27-37. "ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే మానవుడు ఉత్తమ గతిని పొందుతాడు. కాబట్టి ఓ రాజా! దీనిని అత్యంత నియమనిష్టలతో ఆచరించాలి. ఇది కాక పాపాలను నశింపజేసేంత పవిత్రమైన ఏకాదశి మరొకటి లేదు. శంఖ చక్ర గదాధరుడైన శ్రీమహావిష్ణువు నిద్రించే ఆ రోజున, భక్తులు భగవంతుడిని భక్తితో పూజించి, ముఖ్యంగా రాత్రివేళ జాగరణ చేయాలి. అలా చేయడం వల్ల కలిగే పుణ్యఫలాన్ని బ్రహ్మదేవుడు కూడా లెక్కించలేడు. ​ఓ రాజా! సమస్త పాపాలను తొలగించి, సుఖాలను, మోక్షాన్ని ఇచ్చే ఈ ఉత్తమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు, చండాలుడైనా సరే నాతోపాటు నా వైకుంఠంలో నివసిస్తాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు నెలల (చాతుర్మాస్య) కాలాన్ని దీపారాధన చేస్తూ, మోదుగ ఆకులో భోజనం చేస్తూ గడిపే భక్తులంటే నాకు అత్యంత ప్రీతి.

  • без подписи

  • ఆయన అపుడు ఆ గొప్ప సముద్రమును దాటి వానరులతో గూడి లంకను చుట్టు ముట్టి రాక్షసులతో యుద్దమును చేసెను (30). అపుడా వీరుడు రాక్షసులను సంహరించి రాముని సైన్యమును రక్షించెను. శక్తిచే కొట్టబడి నేలగూలిన లక్ష్మణుని సంజీవినితో బ్రతికింప జేసెను (31). మహాదేవుని పుత్రుడగు ఆ హనుమత్ర్పభుడు రామలక్ష్మణులకు సర్వ విధములుగా సుఖమును కలిగించి సైన్యము నంతనూ రక్షించెను (32). శ్రమను ఎరుంగని వాడు, మహాబలసంపన్నమగు దేహము గలవాడు అగు ఆ హనుమంతుడు సకుటుంబముగా రావణుని వశింపజేసి దేవతలకు మోదమును గూర్చెను (33). హనుమంతుడు మహీరావణుడను రాక్షసుని సంహరించి వాని వద్ద బందీలుగానున్న రామలక్ష్మణులను రక్షించి తీసుకొని వచ్చెను (34). ఆ వానరవీరుడు సర్వవిధములుగా రామకార్యమును చేయుచూ రాక్షసులను నిర్జించి వివిధలీలలను ప్రకటించెను (35). ఆ కపివీరుడు తాను గొప్ప భక్తుడై సీతారాములకు సుఖమును కలిగించి భూలోకములో రామభక్తిని సుస్థిరము చేసెను (36). రుద్ర భగవానుడు ఈ విధముగా అవతరించి లక్ష్మణుని ప్రాణములను కాపాడి, దేవతలందరికీ ఆనందమును కలిగించి, భక్తుల నుద్ధరించెను (37). మహావీరుడు, సర్వదా రామకార్యమును చేసినవాడు, రాక్షససంహారి మరియు భక్తప్రియుడు నగు ఆ హనుమంతుడు రామదూతయను ప్రఖ్యాతిని గాంచెను (38). వత్సా! నీకీ తీరున శ్రేష్ఠమైనది, ధన్యమైనది, యశస్సును ఆయుర్దాయమును ఇచ్చునది మరియు కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది యగు హనుమచ్చరిత్రను చెప్పితిని (39). ఎవడైతే దీనిని భక్తితో మనస్సును లగ్నము చేసి వినునో, లేక వినిపించునో వాడు ఇహలోకములో సమస్తభోగముల ననుభవించి మరణించిన తరువాత సర్వశ్రేష్ఠమగు మోక్షమును పొందును (40). శ్రీ శివమహాపురాణములో శతరుద్ర సంహితయందు హనుమదవతారవర్ణనమనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20). శ్రీ హనుమంతుని మహిమా విశేషాలు అన్నిటినీ స్వయంగా వ్యాసుల వారి తండ్రి గారైన పరాశర మహర్షి గారు అందించిన పరాశర సంహితలో చెప్పబడిన అందరూ చేసుకోదగిన అతిమహిమాన్వితమైన హనుమ మంత్రం ఇది👇 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఇలా "శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్" అనే మంత్రాన్ని (శ్రీ హనుమద్ జయ మంత్రం) ఎవరైతే 4 సార్లు పలికి ఏ సత్కార్యం మొదలుపెట్టిన ఆ స్వామి హనుమ ఆ సత్కార్యాన్ని విజయం వైపు నడిపి సంతోషాన్ని ప్రసాదిస్తారు. శివాయ నమః "సర్వం శివార్పణమస్తు"

  • ఈ రోజు అందరూ చదవాల్సిన కథ 👇👇👇👇👇 అరుణాచలా!!!!! "శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్" సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - శతరుద్ర సంహిత -   అధ్యాయం - 20                         హనుమచ్చరిత్ర               నందీశ్వరుడిట్లు పలికెను-                                                                        ఓ మహర్షీ! దీని తరువాత నీవు హనుమచ్చరితమును ప్రీతితో వినుము. శివుడు హనుమద్రూపమును దాల్చి గొప్ప లీలలను ప్రకటించిన తీరును తెలుసుకొనుము (1). ఆ పరమేశ్వరుడు ప్రేమతో శ్రీరామునకు గొప్ప హితమును చేసెను. ఓ విప్రా! సర్వులకు సుఖమును కలిగించు ఆ వృత్తాంతమునంతనూ వినుము (2). ఒకానొక సమయములో అద్భుతమగు లీలలను నెరపువాడు, సకలగుణాభిరాముడు అగు శంకరప్రభుడు విష్ణువు యొక్క మోహినీ రూపమును గాంచెను (3). ఈశ్వరుడగు శంభుడు తన అంతఃకరణమును కాముని బాణములచే కొట్టబడినదా యన్నట్లు చేసి రామకార్యము కొరకై తన వీర్యమును స్ఖలనము చేసెను (4). సప్తర్షులు ఆ శివుని చేత హృదయమునందు ప్రేరేపించబడినవారై రామకార్యము కొరకు ఆ వీర్యమును సాదరముగా పత్రమునందు స్థాపించిరి (5). ఆ మహర్షులు రామకార్యముకొరకై శంభుని ఆ వీర్యమును గౌతముని కుమార్తెయగు అంజనీదేవియందు చెవిద్వారా ప్రవేశపెట్టిరి. (6). తరువాత కొంతకాలమునకు శంభుడు ఆ వీర్యము వలన వానర దేహము గలవాడై జన్మించెను. మహాబలపరాక్రమములు గల ఆ వానరునకు హనుమాన్‌ అను పేరు కలిగెను (7). మహాబలుడు, కపిశ్రేష్ఠుడు అగు ఆ హనుమంతుడు బాలుడుగ నుండగనే సూర్యోదయకాలములో సూర్యుని పండు అని తలపోసి వేగమే తేలికగా ఆ సూర్య బింబమును భక్షించెను (8). మహాబలశాలి, శివావతారము అని యెరింగి దేవతలు ప్రార్థించగా, ఆతడు సూర్యుని విడిచిపెట్టి దేవతలనుండి, ఋషులనుండి వరములను పొందెను (9). అపుడు హనుమంతుడు మిక్కిలి ఆనందముతో తన తల్లి వద్దకు వెళ్ళి ఆ వృత్తాంతమునంతనూ శ్రద్ధతో ఆమెకు విన్నవించెను (10). ధీరుడగు ఆ వానరుడు తరువాత తల్లి యానతిని పొంది ప్రతిదినము సూర్యుని వద్దకు వెళ్లి ఆయన వద్ద విద్యలనన్నిటినీ తేలికగా అభ్యసించెను (11). రుద్రాంశసంభూతుడగు ఆ వానరవీరుడు తల్లియాజ్ఞను పొంది సూర్యుని ఆజ్ఞచే సూర్యుని అంశతో జన్మించిన సుగ్రీవుని వద్దకు వెళ్లెను (12). సుగ్రీవుని అన్నయగు వాలి తమ్ముని భార్యను అపహరించి ఆతనిని తరిమివేసెను. ఆ సుగ్రీవుడు హనుమంతునితో గూడి ఋష్యమూక పర్వతమునందు నివసించెను (13). బుద్ధిశాలి, శివుని అంశతో జన్మించిన వాడు అగు ఆ వానరశ్రేష్ఠుడు తరువాత సుగ్రీవునకు మంత్రియై ఆయనకు అన్ని విధములుగా హితమును చేగూర్చెను (14). భార్య అపహరింపబడగా దుఃఖిస్తూ సోదరునితో కలిసి అచటకు వచ్చిన రామునితో హనుమంతుడు సుగ్రీవునకు సఖ్యమును చేయించెను. దాని వలన సుగ్రీవునకు సుఖము లభించెను (15). వానరవీరుడు, సోదరుని భార్యను అపహరించినవాడు, పాపి, వీరుడననే గర్వము గలవాడు అగు వాలిని రాముడు సంహరించెను (16). వత్సా ! అపుడు వానరశ్రేష్ఠుడు, బుద్ధిశాలియగు ఆ హనుమంతుడు అనేకవానరులతో గూడి రాముని యాజ్ఞచే సీతను వెదుకనారంభించెను (17). ఆ వానరవీరుడు లంకయందు సీత గలదని యెరింగి ఇతరులకు లంఘింప శక్యము కాని సముద్రమును శీఘ్రముగా లంఘించి లంకను చేరెను (18). ఆతడచట పరాక్రమముతో నిండియున్న అద్భుతమగు చరిత్రను సృష్టించి, తన ప్రభువగు శ్రీరామునియొక్క శ్రేష్ఠమగు అంగుళీయకమును సీతాదేవికి ప్రీతితో గుర్తుగా నొసంగెను (19). వీరుడగు ఆ కపీశ్వరుడు రాముని వృత్తాంతమును వినిపించి ఆమె ప్రాణములను కాపాడెను. ఆమె వెంటనే దుఃఖము విడనాడెను (20). ఆతడు ఆమెనుండి గుర్తుగా చూడామణిని తీసుకొని అనేక మంది రాక్షసులను సంహరించి, రావణుని ఉద్యాన వనమును ధ్వంసము చేసి, రాముని సన్నిధికి తిరిగి వచ్చెను (21). అదే సమయములో రావణుని కుమారుడగు అక్షయ కుమారుని చాలమంది రాక్షసులతో సహా సంహరించి అచట నిర్భయముగా గొప్ప లీలలను ప్రకటించి ఆయన గొప్ప ఉపద్రవమును సృష్టించెను (22). ఓ మునీ! రావణుడు ఆయన తోకకు నూనెలో ముంచిన గుడ్డలను చుట్టించి నిప్పు ముట్టించెను. కాని మహాబలశాలియగు ఆ హనుమంతుడు వారి బారినుండి తప్పించుకొని (23) ఒక భవనము నుండి మరియొక భవనముపైకి దుముక జొచ్చెను. మహాదేవుని అంశవలన జన్మించిన ఆ వానరుడు అదే మిషతో లంకానగరమునంతనూ దహించెను (24). వీరుడగు ఆ కపిశ్రేష్ఠుడు అపుడు విభీషణుని ఇట్లు తక్క మిగిలిన లంకను దహించి, తరువాత సముద్రములో చేరి (25), తన తోకయందలి నిప్పును చల్లార్చుకొని ఆవలి తీరమును చేరుకొనెను. శివుని అంశతో జన్మించిన ఆ వీరుడు ఉత్సాహముతో రాముని సన్నిధికి చేరెను (26). మహావేగము గలవాడు, వానరవీరుడు అగు హనుమంతుడు విలంబము లేకుండగా రాముని సన్నిధికి వచ్చి సీతాదేవి యొక్క చూడామణిని ఇచ్చెను (27). అపుడా వీరుడు ఆయన ఆజ్ఞను గైకొని వానరులతో గూడి అనేక పెద్ద పర్వతములను దెచ్చి సముద్రమునందు సేతువును నిర్మించెను (28). అపుడు శ్రీరాముడు అచటకు వెళ్లి సముద్రమును దాటగోరెను.

  • без подписи

  • без подписи

  • వైశ్యకులదేవతైన "నగరేశ్వర స్వామి (పరమశివుడు)"ని వదలక పూజించండి. వింధ్యవాసినిగా విరాజిల్లుతున్న "కాత్యాయని" దేవిని (పార్వతీ మాతను) పూజించండి. బాల్యములో విద్యను ఆర్జించండి. ప్రాయము(ఒక వయస్సు) వచ్చిన తర్వాత ధర్మబద్ధంగా సర్వ సౌఖ్యములను అనుభవించండి. స్వప్నములో(కలలో) కూడా పరస్త్రీ కోరికను, పర ధన వ్యామోహాన్ని మరువవలెను(మర్చిపోవాలి). ఎన్ని కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా ఓర్చుకొని "కులధర్మములు" నిలుపవలెను. సర్వజీవుల యందు సానుభూతి చూపవలెను, గో బ్రాహ్మణుల మేలు కోరవలెను. దేశభక్తి కలిగి ఉండవలెను. కులదేవతా పూజ, గోత్రపూజ, స్నానసంధ్యాద్యనుష్టానసద్వర్తన మీరు ఎంతమాత్రమూ మానకూడదు." అని అనేక ధర్మంబులు భోదించినది. ఆ తర్వాత అమ్మవారు అలాగే ఆ 102 గోత్రీకుల వారు అందరూ అగ్నికి ఆహుతయ్యి నిత్యమైన "కైలాసాన్ని"పొంది శాశ్వత ముక్తిని పొందారు. అప్పటి నుండి ఈ 102 గోత్రీకుల వైశ్యులను "ఆర్య (పూజనీయ) వైశ్యులు"గా పిలవడం జరుగుతుంది. తమ వారికి శాశ్వత ముక్తిని అనుగ్రహించి కైలాస వాసులుగా చేసిన కారణాన అప్పటి నుండి నగరేశ్వరుని (పరమశివుని)తో పాటు "వాసవి మాతను"  కూడా ఆర్యవైశ్యులు తమ కులదేవతగా పూజించడం మొదలైంది. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చిరుతొండనంబి నాయనార్ అనే ఒక వైశ్య భక్తుణ్ణి అనుగ్రహిస్తూ పరమశివుడు ఇలా వరం ఇచ్చారు: "ఏ వైశ్యుడు ఐతే నా ప్రతిరూపమైన శివలింగాన్ని తన ఇంట్లో పెట్టుకొని కొంత విభూతి లింగం మీద వేసి కొన్ని నీళ్లు పోసి అభిషేకించి ఆ నీటితో కలిసిన విభూతిని ముఖాన ధరిస్తాడో అట్టి వైశ్యుని గృహం కైలాసంతో సమానం అలాగే అట్టి వైశ్యులు శరీరం విడిచిన తర్వాత నరకం పొందక శాశ్వతమైన కైలాసాన్ని పొందుతారు" అని.  (పెరియ పురాణం నుండి సంగ్రహించబడినది) అలా అహింస - స్వధర్మం అనే రెండు శ్రేష్ఠ మార్గాలను అనుసరించి జీవులు తమ ప్రారబ్ధాన్ని కూడా జయించి ఈ జన్మయే ఆఖరి జన్మగా చేసుకోగలిగే విధంగా తెలియచేసిన జగన్మాత "శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి" అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండు గాక. జై వాసవి! జై జై వాసవి!!! శివాయ నమః "సర్వం శివార్పణమస్తు"

  • అరుణాచలా!!!!! జై వాసవి🙏 వైశాఖ శుక్ల దశమి - జగన్మాత వాసవి మాతగా అవతరించడం మధుర మీనాక్షి దేవి యజ్ఞం నుండి ఎలా ఆవిర్భవించిందో అలాగే వాసవి మాత యజ్ఞ ఫలంగా కుసుమాంబ - కుసుమశ్రేష్ఠి దంపతులకు కుమార్తెగా జన్మించింది. వాసవి మాత స్వయంగా జగన్మాత యొక్క అంశతో ఈ భూమి మీద అవతరించింది. ఎలా ఐతే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునుకు సహాయం చేయడం కోసం యోగమాయ సోదరిగా పుట్టిందో అలాగే ఈ కలియుగంలో ఆ జగన్మాతకు తోడుగా శ్రీ మహావిష్ణువు "విరూపాక్షుడు" అనే పేరుతో వాసవి మాతకు సోదరుడిగా వచ్చాడు. ఐతే, ఇక్కడ అమ్మ అవతరణ కథను చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఇక్కడ కేవలం అమ్మవారి అవతారం వెనుక ఉన్న రహస్యం అలాగే అమ్మవారు సమస్త వైశ్య జాతికి అంతిమంగా ఇచ్చిన సందేశం మాత్రమే ఇక్కడ చెప్తున్నాను: ఎవరి జన్మకైనా ముఖ్య కారణం ఒక్కటే, "శాశ్వత ముక్తిని పొందడం" ఇది పొందనంత వరకు మరలా మరలా జన్మించడం సహజం. ఐతే, ఈ కలియుగంలో సమస్త మానవాళి సులభంగా శాశ్వత ముక్తిని పొందగలిగే మార్గం "స్వధర్మాచరణ". ఈ విషయాన్నే శ్రీ గణేశుడు సృష్టాదిలో శ్రీమహావిష్ణువుకు, తర్వాత వరేణ్య మహారాజుకు చెప్పిన గీతలో ఇలా అంటారు శ్రీగణేశుడు: స్వధర్మము గుణములేని దైనను గుణముతోఁగూడిన పరధర్మముకంటెను శ్రేష్ఠమైనది. తన ధర్మము నందు మరణముగూడ శ్రేష్ఠముగాని పరధర్మమునందలి అమృతత్వమైనను భయంకరమైనదే. (పరధర్మం సకల భోగాలను ఇచ్చేదైనా సరే అది నరక హేతువే). (35వ శ్లోకం, అధ్యాయం - 2, శ్రీ గణేశ గీత) అలాగే ఇదే విషయాన్ని సృష్టాదిలో శ్రీమహావిష్ణువు మనువుకు, తర్వాత అర్జునకు చెప్పిన గీతలో ఇలా అంటారు భగవానుడు: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం అనుసరించటం ప్రమాదకరమైనది. (35వ శ్లోకం, అధ్యాయం - 3, భగవద్గీత) మనం వాసవి మాత జీవిత చరిత్ర గమనిస్తే ఈ స్వధర్మాచరణే అంతటా కనబడుతుంది. అమ్మవారు సకల లలిత కళలకు నిలయం. తాను వైశ్యులలో జన్మించిన కారణాన ఎల్లవేళలా వైశ్య ధర్మాలనే ఆచరిస్తూ వచ్చింది. ప్రతిరోజూ వైశ్య కులదేవతైన "నగరేశ్వరుణ్ణి (పరమశివుణ్ణి)" క్రమం తప్పకుండా పూజిస్తుంది. తన తండ్రి అక్కడి 18 పురాలకు రాజైనా తాను మాత్రం రాజ్య పరిపాలన వైశ్యుల వృత్తి కాదు అనే తన తండ్రికి చెప్పేది. వైశ్యులకు వ్యాపార, వాణిజ్యములు, గో సంరక్షణ, అహింస వంటి విధులు మాత్రమే విధింపబడ్డాయి కావున మిగిలినవి ఆచరిస్తే వారు స్వధర్మాన్ని వీడిన వారవుతారు. ఇలా స్వధర్మాన్ని మాత్రమే ఆచరించే జగన్మాతను విష్ణువర్ధనుడు అనే రాజు చూసి ఆమె సౌందర్యానికి మైమరచి తనని వివాహం చేసుకోవాలి అని కుసుమ శ్రేష్ఠి దంపతులకు తంతు పంపాడు. ఆ విషయం గురించి మొత్తం వైశ్యుల్లో ఉన్న  714 గోత్రీకుల పెద్దలందరి మధ్య చర్చ జరగగా రాజుకు భయపడి 612 గోత్రికులు వాసవి మాతను ఆ రాజుకు ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పగా 102 గోత్రీకులు మాత్రం అమ్మవారు చెప్పిన స్వధర్మానికి కట్టుబడి యుద్ధం వైశ్య ధర్మం కాదని అమ్మవారి ఆజ్ఞ మీద ఆ 102 గోత్రీకుల నుండి ఒక్కో జంట వచ్చి అందరూ అహింసా మార్గంలో వేద సమ్మతమైన విధానంలో "అగ్నిలో ఆహుతి" అవ్వడానికి సిద్ధం అయ్యారు. ఐతే, వారిలో అప్పుడే వివాహం జరిగిన ఒక జంట కూడా ఉంది. వారిని అగ్నిలో ప్రవేశించడానికి ఒప్పుకోలేదు. కానీ వారు మేము కూడా మీతోనే వస్తాం అని అనగా అప్పుడు అమ్మవారు వారికి ఒక వరం ఇచ్చింది, ఇక నుండి "వైశ్యులు అందరూ తాము ధనం లెక్కపెట్టేటప్పుడు ముందుగా మిమ్మల్ని స్మరించే లెక్కపెడతారు" అని. అందుకే అప్పటి నుండి ఆ దంపతుల పేరు మీదుగా వైశ్యులు ధనం లెక్కపెట్టేముందు ఒకటి, రెండూ, మూడు అని కాకుండా "లాభం", రెండూ, మూడు అని పలుకుతూ ఆనాడు అగ్నిలో ఆహుతైన ఆ లాభశ్రేష్ఠి దంపతులను తలుచుకుంటారు. ఐతే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ నాడు దక్షుడు, దేవతలు ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సతి దేవి యోగాగ్నిలో శరీరం వదిలేసింది. ఈ కలియుగంలో మళ్లీ ధర్మం తప్పుతున్న వారికి బుద్ధి చెప్పడానికి ఆ సతీ మాత అంశగా వచ్చిన వాసవి మాత అగ్నిలో శరీరం విడిచింది. అప్పుడు దక్షుడు ఎలా తల తెగి ప్రాణం విడిచాడో ఇప్పుడు ఈ విష్ణువర్ధనుడు కూడా అలాగే తన తల ముక్కలై చనిపోయాడు. అమ్మవారి ఈ రూపంలో అహింస, స్వధర్మం అనేవి ప్రధానం కనుక అమ్మ వాటికి అనుగుణంగానే నడిచింది. ఐతే, అగ్నిగుండంలో ప్రవేశించే ముందు ఆ ప్రజలందరూ వాసవి మాతను తన నిజస్వరూపంతో దర్శనం ఇవ్వమని కోరగా అప్పుడు ఆమెలో ఉన్న పార్వతీ మాత అంశ వారికి దర్శనం ఇచ్చింది, ఆ తర్వాత వైశ్యులను ఉద్దేశించి ఇలా పలికింది అమ్మవారు: - "నాయనలారా! మనం అగ్నిహోత్రనిలో లీనమైన తక్షణమే విష్ణువర్ధనుడి శిరస్సు వేయివ్రయ్యలై పోవును. బాలనగరయువకులరా! ఆగండి! మీరు ఎంతమాత్రమూ ఈ కార్యానికి (అంటే అగ్నిహోత్రములో ప్రవేశించడానికి) సాహసించకూడదు. అమలమునైన (ఏ దోషంలేని) వైశ్యకులం అంతమవుతుంది కదా! కనుక మీరు అగ్ని ప్రవేశం చేయకండి.

  • без подписи

  • నిర్వాణషట్కమ్, ఈ స్తోత్రం చదువుతుంటేనే ఆ వ్యక్తిలో ఒకానొక ఆనందం కలుగుతుంది. అలాంటి ఈ స్తోత్రం గురించి ఇంకేం చెప్పాలి. సాంబే పరబ్రహ్మణి దశశ్లోకి, ఈ స్తోత్రం భావ సహితంగా చదివితే ఇక జీవునికి పరబ్రహము పరమైన సమస్త సందేహాలు తొలిగిపోతాయి. అంతేకాక క్రమంగా తనకి ఉన్న సంసార వ్యామోహాలు తన నుండి తనకే తెలియకుండా దూరం అవుతాయి. అలా తనకే తెలియకుండా పరబ్రహ్మమునకు దగ్గరవుతూ ఆ పరబ్రహ్మములోనే ఐక్యం అవుతారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే, జగద్గురువులు అందించిన స్తోత్ర విశేషాలే అనంతం ఇక వారు అందించిన బ్రహ్మసూత్ర భాష్యాలు చెప్పుకోవడం మొదలిడితే ఇక మన జీవితకాలం సరిపోతుందా? అన్న ప్రశ్న తలెత్తుంది.  అందుకే ఈ కొద్ది జీవితంలో మనకి జగద్గురువులు అందించి అనేకమైన అమోఘమైన స్తోత్ర రత్నాల్లో ఎదో ఒక్కటైన పట్టుకొని జీవితాన్ని తరింపచేసుకోవచ్చు. ఈ స్తోత్ర పారాయణలకు ఎటువంటి కుల-మత-వర్ణ- లింగ బేధాలు ఏమీ లేవు.  ఎటువంటి ఉపనయనాది సంస్కారాలతో కూడా పనిలేదు.  కాబట్టి ఈ రోజున, అంటే, జగద్గురువులు - వేదమాత ఆవిర్భవించిన ఈ తిధిన ఎదో ఒక జగద్గురు స్తోత్రాన్ని స్వీకరించి నిత్యం పారాయణ చేయండి. దాని వలన కలిగే ఆ మహత్తరమైన ఫలితాన్ని చూడండి. అలాగే గాయత్రి మంత్రాలను గురించి ఒకసారి చూద్దాం: మనకి ఎన్నో గాయత్రి మంత్రాలు ఉన్నాయి. అన్నిటికీ మూలం జగన్మాతైన వేదమాత గాయత్రి మాతయే.  ఇందులో మళ్లీ రెండు రకాలు ఉన్నాయి. అంటే, నియమ నిష్టలతో కూడిన గాయత్రి మంత్రాలు అలాగే ఏ నియమ నిబంధనలు లేని గాయత్రి మంత్రాలు. మనం కొన్ని గాయత్రి మంత్రాలు సాధన చేయాలంటే తప్పకుండా ఉపనయనాది సంస్కారాలు జరగాలి, అలాగే తండ్రి ద్వారా బ్రహ్మోపదేశం పొందాలి. అలాగే బ్రహ్మోపదేశం పొందనవసరం లేనివి, ఉపనయన సంస్కారాలు అవసరం లేని మంత్రాలు కూడా ఉన్నాయి.  అవేంటో చూద్దాం: సృష్టాదిలో ఉన్న గాయత్రి మంత్రం "బ్రహ్మ గాయత్రి". బ్రహ్మను ప్రతిపాదించే ఈ గాయత్రి మంత్రాన్నే ఆ కాలంలో తండ్రి ద్వారా ఉపనయన కార్యక్రమంలో ఉపదేశంగా పొంది, దానిని సాధన చేసి తరించేవారు. ఇలా "బ్రహ్మ గాయత్రి" ఉపదేశం పొందడాన్నే బ్రహ్మోపదేశం అనేవారు.  ఆ తర్వాత కాల క్రమంగా "ఇంద్ర గాయత్రి" లోకంలోకి ప్రచారం చేయబడింది. అప్పటి నుండి ఈ ఇంద్ర గాయత్రి మంత్రాన్నే బ్రహ్మోపదేశంగా పొందడం మొదలైంది. ఆ తర్వాత మత్స్య గాయత్రి మంత్రం లోకంలోకి ప్రవేశించింది. (కొందరు వారి నమ్మకాల రీత్యా ఈ మత్స్య గాయత్రిని ఆదిగాయత్రి అని అంటారు). ఆ తర్వాత "వశిష్ఠ గాయత్రి" మంత్రం. ఐతే, కొందరు ఈ వశిష్ఠ గాయత్రి అన్నా ఇంద్ర గాయత్రి ఐనా ఒకటే అనేవారు ఉన్నారు.  ఆ తర్వాత నేటి కాలంలో విశ్వామిత్రుడి దర్శించిన గాయత్రి మంత్రం ప్రచారం జరిగింది. ఈ కాలంలో ఆ విశ్వామిత్రుని గాయత్రి మంత్రాన్నే బ్రహ్మోపదేశంగా పొందుతున్నారు.  అయితే, ఇలా ఈ గాయత్రి మంత్రాలు ఉపదేశంగా పొందాలంటే తప్పకుండా మనకి ఉపనయనాది సంస్కారాలు జరిగి తీరాలి.  (కొన్ని మంత్ర శాస్త్ర గ్రంధాల, గురువులు ఉపదేశాల ఆధారంగా) కానీ, సర్వ జీవుల మీద అనుగ్రహముతో శ్రీమహావిష్ణువు యొక జగద్గురు స్వరూపమైన వ్యాస భగవానులు వారు "సర్వ గాయత్రి మంత్రాన్ని" శ్రీమద్దేవి భాగవతం అనేటువంటి పరమపవిత్రమైన మహాపురాణం ద్వారా లోకానికి అందించారు. అదేంటో, చూద్దాం : సర్వ గాయత్రి మంత్రం “సర్వ చైతన్య రూపాం తాం |  ఆద్యాం విద్యాం చ ధీమహి |  బుద్ధిం యా న: ప్రచోదయాత్ |” ఈ సర్వ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా జపం చెయ్యవచ్చు. దీనికి ఎటువంటి ఉపదేశం అవసరంలేదు అనేది శాస్త్ర వాక్కు. ఈ గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం ద్వారా కూడా జీవుడు క్రమంగా పరబ్రహ్మత్వాన్ని పొందుతారు. శివాయ నమః "సర్వం శివార్పణమస్తు"

  • అరుణాచలా!!! వైశాఖ శుక్ల పంచమి - గాయత్రి మాత ఆవిర్భావం - జగద్గురువుల అవతారోత్సవం నిర్గుణ స్వరూపిణి ఐన వేదమాత గాయత్రి దేవి సగుణ రూపంలో దర్శనం ఇచ్చిన తిథి వైశాఖ శుక్ల పంచమి. ఈ అఖండ భారతావనికి ప్రాణ ప్రదం వేదం. అలాంటి వేదానికి ప్రతిరూపం గాయత్రి దేవి. అట్టి గాయత్రి దేవి ఆవిర్భవించిన తిధిలోనే ఈ సనాతన ధర్మాన్ని మరలా పునఃప్రతిష్ట చేసి వేద సారమైన అద్వైతాన్ని అందరికి అందించిన జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు (మృగశిర నక్షత్రం) వారు అవతరించిన తిథి కూడా నేడే. అలాగే శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని స్థాపించిన జగదాచార్యులు భగవద్ శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యులు (ఆరుద్ర నక్షత్రం) వారు జన్మించిన తిథి కూడా నేడే. కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం జన్మనక్షత్రం రోజున  అవతారోత్సవం చేస్తారు. అలాగే, స్మార్త సంప్రదాయం ప్రకారం జన్మ తిథిన అవతారోత్సవం చేస్తారు. ముఖ్యంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరుల వారు వైదిక ధర్మోద్ధరణ కొరకై అద్వైతంలో ఎన్నో భాష్యములు, స్తోత్రములను సామాన్యుడి నుండి జ్ఞానులు వరకు అందరిని తరింపచేసే విధంగా సరళంగా రచించారు.  సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవింద స్తోత్రం లాంటి ఎన్నో గొప్ప స్తోత్రములను మనకు అందించారు. దేవీదేవతల మీద వారు చేసిన స్తోత్రాలు, వేద ఉపనిషత్తుల మీద భాష్యములు, ఇతర సాహిత్య గ్రంథరచనములు తెలుసుకుని అర్థం చేసుకోవడానికి జీవితకాలం కృషిచేసినా సరిపోదు.  మానవుని యొక్క కుల-మత-వర్ణ బేధాలు ఎంచక సమస్త మానవులకు ఉపయోగకరమైన వారి వారి స్థాయిని బట్టి ఆత్మొద్దరణకు, అలాగే లౌకిక జీవన సమస్యలు తొలగడానికి, సుఖ భోగాలకు, శాశ్వత ముక్తికి ఉపయుక్తమైన అన్నీ రకాల భాష్యాలు, స్తోత్రాలు అందించారు.  ఉదాహరణకు:  శివానంద లహరి, సౌందర్య లహరి ఇవి జీవుని లౌకిక సమస్యలు తీర్చడమే కాక ఎంతో ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని అనుగ్రహించి క్రమంగా అలౌకిక తత్త్వ జ్ఞానాన్ని అందించడంలో ఎంతో శ్రేష్టమైనవి. కాలభైరవ అష్టకం, ఇది కామక్రోధాది దుర్గుణాలనే గాక అపమృత్యు దోషాలను కూడా తొలిగిస్తూ మన చుట్టూ ఒక రక్షణ వలయంగా నిలుస్తుంది. శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, ఇది ఎట్టి ఆపద నుండి ఐనా తక్షణమే బయట పడేసేట్టు చేసే స్తోత్రం. శ్రీ శివ భుజంగం, ఇది సమస్త లౌకిక కోరికలు అంటే చక్కటి సంసారం, నిండు నూరేళ్ళ ఆయుష్షు, ఆరోగ్యం అన్నీ ప్రసాదించి చివరిగా ముక్తిని ఇస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం, ప్రతిరోజూ ఈ స్తోత్రం చదవడం వల్ల ధన - ధాన్య - వివాహాది సమస్త లౌకిక కోరికలు తీరడమే కాదు - ఒకవేళ జీవుడు తన చివరి క్షణంలో భగవంతుణ్ణి స్మరించలేకపోయినా సరే, నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్యుడు అక్కడ దర్శనం ఇచ్చి ఆ యమ దూతలను తొలిగించి తనతో పాటు తన లోకానికి (మహా కైలాసంలో ఉండే స్కంద లోకానికి) తీసుకొని వెళ్తాడు. శ్రీ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం, ఈ స్తోత్రం భక్తితో ఒక్కసారైనా జగన్మాత సన్నిధిలో పఠించడం ద్వారా మనం తెలిసి తెలియక చేసిన సమస్త అపరాధాలు తొలిగించబడి రక్షింపబడతాము. మోహముద్గరం, ఈ స్తోత్రం ద్వారా జీవులు ఎవరైనా తమ తమ పాండిత్యానికి అహంకరించి జీవిస్తుంటే అట్టి వారి అహంకారాన్ని తొలిగించి, సంసార మొహాన్ని నాశనం చేస్తుంది. శ్రీ శివ మానస పూజా స్తోత్రం, జీవుడు సర్వవేళలా ఈశ్వర సన్నిధికి వెళ్ళవచ్చు లేదా ఆరోగ్యం సహకరించకనో లేక ఇంకేమైనా కారణం చేత వెళ్లలేకపోవచ్చు. అలా వెళ్లలేని సందర్భంలో ఇంట్లోనే లేదా ఎక్కడైనా ప్రశాంతమైన స్థలంలో కూర్చొని 5 శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం భావ సహితంగా చదువుకోవడం ద్వారా ఈశ్వర దర్శనం చేయడం వల్ల కలిగే ఫలితం తక్షణమే లభిస్తుంది.  అన్నపూర్ణా స్తోత్రం, ఇక ఈ స్తోత్రం మాహాత్మ్యం తెలియని వారు ఎవరూ లేరు. ఉండరూ. ఇది మన లౌకిక ఆకలిని మాత్రమే తీర్చే స్తోత్రమే కాదు. ఈ సంసార బంధాలను తొలిగించే జ్ఞాన - వైరాగ్యాలు అనే పరమౌషధాన్ని ఆహారంగా జీవునికి అనుగ్రహించే స్తోత్రం.  గుర్వాష్టకం (లేదా తోటకాష్టకం - ఇది పాడింది జగద్గురువుల శిష్యులు) ఐతే ఈ రెంటిలో ఏది భక్తితో భావ సహితంగా పారాయణ చేసినా జీవులు సంపూర్ణంగా గురువుల అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రీగంగా స్తోత్రం, ఈ స్తోత్రం మన పాపాలను తొలిగించడమే కాదు - మన కోరికలను అన్నిటినీ తీర్చి పరమపదాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ గణేశ పంచారత్నం, ఈ స్తోత్రం ప్రతిరోజూ ప్రభాత కాలంలో హృదయంలో గణేశుణ్ణి భావిస్తూ పారాయణ చేస్తే చివరి రోజులు వరకు కూడా ఆ వ్యక్తికి ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి దోషాలు కలగవు, మంచి జీవిత భాగస్వామితో చక్కటి పిల్లలతో పరిపూర్ణమైన ఆరోగ్యంతో కూడిన ఆయుష్షు కలిగి జీవించి, నిత్యం గణేషుణ్ణి హృదయంలో దర్శించిన ఫలించేత శరీరం విడిచిన తర్వాత గణేశ లోకమైన  "స్వానంద లోకం" పొందుతారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, ఈ స్తోత్రం మహిమను చెప్పాలంటే ఒక్క మాట చెప్పి ఊరకుండటమే అదేంటంటే, అన్నీ స్తోత్రాలు నక్షత్రాలైతే ఈ స్తోత్రం సూర్యుడే. ఈ స్తోత్ర వైభవం, మహిమ ముందు మిగిలినవి కనబడవు.

  • без подписи

  • అరుణాచల శివ!!!!! ఓం నమః శివాయై చ నమః శివాయ🙏 అక్షయ తృతీయ ఈ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది బంగారం. ఐతే, బంగారానికి ఈ తిధికి సంబంధం లేదు. కొంతమంది చెప్తారు ఈ తిథి రోజు బంగారం కొంటే అక్షయం అవుతుంది అని. కానీ, వాస్తవానికి ఈ తిథి రోజున కొనే వాటికి అక్షయ ఫలాన్ని చెప్పలేదు. కేవలం దానం చేసే వాటికే అక్షయ ఫలం అని చెప్పారు. అసలు ఈ తృతీయకు అక్షయ అని ఎందుకు అన్నారు అంటే? మనకి యుగాదులు, మన్వంతరాదులు ఉన్నాయి. ఆ తిధులు అన్నిటినీ అక్షయ తిధులు అనే అంటారు. కాకపోతే ఈ వైశాఖ మాస శుక్ల పక్ష తృతీయ రోజున ఇంకా చాలా విశేషాలు ఉండడం వల్ల ఈ తిథి మాత్రం బాగా ప్రాచుర్యంలో ఉంది. 1. ఈ తిథి రోజున కృతయుగం ప్రారంభం అయ్యింది. అలాంటి యుగారంభ తిథి నాడు చేసే దానధర్మాల ఫలం అనేది ఎన్నటికీ తరగదు. అంటే అక్షయంగా ఉంటుంది అని మనకి పురాణాల్లో ఎంతో స్పష్టంగా చెప్పారు. అందుకే ఈ తిధికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. 2. ఇదే తిథి రోజున సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారికి చందనోత్సవం జరుపుతారు. 3. ఈ తిథి రోజునే వనవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను (ఆహారానికి లోటులేకుండా చేసే దివ్య పాత్రని) అనుగ్రహించాడు. 4. శ్రీమహావిష్ణువు పరశురామునిగా అవతరించిన తిథి ఈ రోజే. 5. పరబ్రహ్మ స్వరూపిణి ఐన శ్రీ అన్నపూర్ణ మాత ఆవిర్భవించిన తిథి ఇదే. 6. శివానుగ్రహముతో నిత్య ఐశ్వర్యము, శుభములు, సిరిసంపదలను, జయములను ప్రసాదించే శ్రీ కుబేర స్వామి "అలాకాపురిని" అధిష్టించిన తిథి ఈ రోజే. 7. దశ మహావిద్యా స్వరూపిణి, శాశ్వత మోక్షవిద్యా స్వరూపిణి ఐన జగన్మాత "శ్రీ మాతంగి" దేవిగా అవతరించిన తిథి ఈ వైశాఖ శుక్ల పక్ష తృతీయ. 8. శైవాచార్యుడైన శ్రీ బసవేశ్వర స్వామి వారు అవతరించినది ఈ రోజునే. 9. ఈ రోజున జగన్మాతను శ్రీలలితా పరమేశ్వరిగా పూజించడం ద్వారా సకల దేవతలను ఏక కాలంలో పూజించిన ఫలం పొందుతారని చాలా విశేషంగా చెప్తారు. 10. పార్వతి మాత పరమశివుని అనుగ్రహం పొందడం కోసం చేసిన నందా వ్రతంలో భాగంగా ఈ అక్షయ తృతీయ తిథి నుండి మొదలు ఈ మాసం మొత్తం ఆ రుద్రునికి నువ్వుల ఆహారాన్ని - జొన్న అన్నాన్ని నైవేద్యంగా పెట్టి పూజించి ఆ పరమేశ్వరుని ప్రీతికి పాత్రురాలయ్యింది.  11. పైన ఫొటోలో వ్రాయబడి ఉంది. ఇలా ఇన్ని విశేషాలు ఉన్న కారణంగానే మనకి ఎన్నో అక్షయ తిధులు ఉన్నా సరే, ఈ అక్షయ తిథి, ఈ అక్షయ తిధిన చేసే దానధర్మాల ఫలం మాత్రం చాలా ప్రత్యేకం. శివాయ నమః "సర్వం శివార్పణమస్తు"

  • без подписи

  • без подписи

  • పంచాక్షరీ మహావిద్య మాహాత్మ్యం - 4 మహావిద్య - మోక్ష విద్య - "పంచాక్షరి" - స్థూల ప్రణవం - వేద సారం - పరమశివానుగ్రహ కారకం

  • పంచాక్షరీ మహావిద్య మాహాత్మ్యం - 4 మహావిద్య - మోక్ష విద్య - "పంచాక్షరి" - స్థూల ప్రణవం - వేద సారం - పరమశివానుగ్రహ కారకం

  • పంచాక్షరీ మహావిద్య మాహాత్మ్యం - 3 మహావిద్య - మోక్ష విద్య - "పంచాక్షరి" - స్థూల ప్రణవం - వేద సారం - పరమశివానుగ్రహ కారకం

  • без подписи