YSR Congress Party - YSRCP
СтатистикаYuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by #YSJagan Our goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life.. @JaganSpeaks
- Последний пост
- 12 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 20
- Всего постов
- 52
- Тип
- открытый
- Язык
- te
- Категория
- Политика
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 274
- 1/48двое суток
- 314
- 1/72трое суток
- 338
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
శ్రీకాకుళంలో జోగయ్య కుటుంబ సభ్యులు బయటికి వచ్చి టీడీపీ ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడు ఆరోజు వాహనం నడిపాడని చెప్తున్నారు. మీకు నిజంగా చట్టంపై నమ్మకం ఉంటే.. ఆ కేసుని రీఓపెన్ చేసి విచారణ చేయించండి. మీకు ఆ దమ్ముందా @ncbn ? -ఆరె శ్యామల గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
без подписи
без подписи
без подписи
без подписи
జగనన్న రాకకు కర్నూలు గడ్డ సిద్ధం... రేపటి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనపై కీలక సమావేశం వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటన నేపథ్యంలో వైయస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారి నివాసానికి మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురాం గారు విచ్చేశారు ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి గారితో సమావేశమై జగనన్న పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై కీలకంగా చర్చించారు. జగనన్నకు ఘన స్వాగతం పలికేందుకు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
без подписи
ఇది జర్నలిజమా.. బ్రోకరిజమా? వైయస్ జగన్ గారి హయాంలో పరిమితంగానే అప్పుల్ని చేసినా.. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతోందంటూ నిత్యం బ్యానర్ వార్తలతో గగ్గోలు పెట్టిన ఈనాడు 2019-24లో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేసిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ.. గత 26 నెలల్లోనే రూ.3.68 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు కానీ.. అప్పు అనే పదం వాడకుండా రుణసమీకరణ అంటూ ప్రజలకు అర్థంకాకుండా మధ్యపేజీల్లో ఓ మూలన చిన్న కాలమ్ వార్త వేసిన ఈనాడు #SadistChandraBabu #CBNDebtRecord #MosagaduBabu
без подписи
без подписи
మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి తూమాటి మాధవరావు గారు పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలి ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలి : వైయస్ జగన్ గారు శాసనమండలిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ తరఫున తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి పార్టీ ఎమ్మెల్సీలకు శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉందని, త్వరలో ఆ పదవి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తరఫున తూమాటి మాధవరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని శ్రీ వైయస్ జగన్ సూచించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలంతా పరస్పర సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మాధవరావు ఎన్నికకు అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.
без подписи
తాడేపల్లి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలి అవసరమైతే చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరనున్న ఉపాధ్యాయ సంఘాల బృందం వైయస్ జగన్ చొరవతో రేపు కేంద్ర విద్యాశాఖ మంత్రితో భేటీ వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాల నేతలు రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుంచి పూర్తి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, వైయస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ (YSRTA AP) సహా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, ఇతర సర్వీస్ ప్రయోజనాల కోసం మళ్లీ TET రాయాల్సి వస్తుండటం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని వారు వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి TET నిబంధన గుదిబండగా మారిందని, కేవలం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం కాకుండా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తిస్థాయి మినహాయింపు కల్పించేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన శ్రీ వైయస్ జగన్, ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రితో ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు చేశారు. ఈ భేటీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, TET నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఢిల్లీ వెళ్లనున్న ప్రతినిధి బృందం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు: ఎం.వి.రామచంద్రారెడ్డి, కె.కల్పలత, పి.చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు: కేశవరపు జాలి రెడ్డి – APYSRTA రాష్ట్ర అధ్యక్షుడు, షేక్ జంషీద్ – APYSRTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సి.కె. వెంకటనాథ రెడ్డి – APYSRTA రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పి. అశోక్ కుమార్ – APYSRTA రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎస్. అమరనాథ్ – APYSRTA కడప జిల్లా అధ్యక్షుడు, ఎన్. సంగమేశ్వర్ – STU కడప జిల్లా అధ్యక్షుడు, FAFTO కడప జిల్లా అధ్యక్షుడు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్కు పరిష్కారం లభించేలా కేంద్రంతో చర్చించాలని ప్రతినిధులు శ్రీ వైయస్ జగన్ను కోరగా, సమస్య పరిష్కారానికి వైఎస్సార్సీపీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. వైయస్ జగన్, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవతో జరుగుతున్న ఈ భేటీ ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
без подписи
без подписи
🚨 #CBNDebtRecord మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600 కోట్లు అప్పు చేసింది. ఈ వార్తను ఎల్లో మీడియాలో ఎక్కడో మూలన రుణ సమీకరణ అంటూ రాసుకొచ్చింది. వాస్తవానికి నిన్న ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,800 కోట్లు ఐదేళ్లలో వైయస్ జగన్ గారి ప్రభుత్వం రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 26 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు రూ.3.68 లక్షల కోట్లు -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండను తవ్వేస్తూ కూటమి నేతలు చేస్తున్న దోపిడీని అడ్డుకుంటాం. ఈ మైనింగ్ దోపిడీపై పార్లమెంట్లో గళం వినిపించి.. కూటమి నేతల్ని నిలదీస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ పవిత్రమైన పంచదార్ల కొండను దోపిడీకి గురికానివ్వం. -గొల్ల బాబూరావు గారు, వైయస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ
без подписи
బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పరిశ్రమలపై దాడులు, దౌర్జన్యాలు పారిశ్రామిక వేత్తలకు బెదిరింపులు నిత్య కృత్యాలు అయిపోయాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రం వదిలిపోయేలా చేస్తున్నారు. -వీరశేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి